hyderabadupdates.com movies తెలుగు ‘పద్మాలు’ వీరే

తెలుగు ‘పద్మాలు’ వీరే

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 131 మందికి పద్మ అవార్డుల దక్కాయి. ఐదుగురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందిని పద్మ శ్రీ వరించింది. ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర(మరణానంతరం) పద్మ విభూషణ్, మలయాళ లెజెండరీ నటుడు మమ్మూట్టికి పద్మ భూషణ్ దక్కాయి.

తెలుగు రాష్ట్రాలకు నుంచి 11 మందికి పద్మ అవార్డులు. ఏపీకి చెందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌, వెంపటి కుటుంబ శాస్త్రికి పద్మశ్రీ దక్కింది. తెలంగాణకు చెందిన విజయ్‌ ఆనంద్‌రెడ్డి, గడ్డమనుగు చంద్రమౌళి, దీపికారెడ్డిలను పద్మశ్రీ వరించింది.

డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, రామారెడ్డి మామిడి, గూడూరు వెంకట్రావులకు, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణియన్ లకు పద్మశ్రీ దక్కింది. కళా విభాగంలో మాగంటి మురళీమోహన్‌కు పద్మశ్రీ. సినీనటుడు రాజేంద్ర ప్రసాద్‌కు పద్మశ్రీ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే.

Related Post

ఆర్కే ఏమ‌య్యారు… వైసీపీలో హాట్ టాపిక్ ..?ఆర్కే ఏమ‌య్యారు… వైసీపీలో హాట్ టాపిక్ ..?

మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం పేరు చెప్ప‌గానే ఠ‌క్కున ఇప్పుడు నారా లోకేష్ గుర్తుకు వ‌స్తున్నారు. నియోజ‌క వర్గంలో చేప‌డుతున్న ప‌నులు కావొచ్చు.. తొలిసారి ఇక్క‌డ నుంచి విజ‌యం ద‌క్కించుకోవ‌డం కావొచ్చు.. మొత్తంగా మంగ‌ళ‌గిరి అన‌గానే నారా లోకేష్ పేరు వినిపిస్తోంది. అయితే.. ఒక‌ప్పుడు

జూబ్లీహిల్స్… ఆ పార్టీ వైపే ఎగ్జిట్ పోల్స్ మొగ్గు!జూబ్లీహిల్స్… ఆ పార్టీ వైపే ఎగ్జిట్ పోల్స్ మొగ్గు!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణతో పాటు ఏపీలోనూ తీవ్ర స్థాయిలో రాజకీయ ఉత్కంఠ రేపిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క స్థానంలో గెలుపు కోసం అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలు ప్రయోగించాయి. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్