hyderabadupdates.com Gallery నాయుడు ర‌సికుడే రాజీనామా చేయాల్సిందే

నాయుడు ర‌సికుడే రాజీనామా చేయాల్సిందే

నాయుడు ర‌సికుడే రాజీనామా చేయాల్సిందే post thumbnail image

తిరుప‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి మాజీ చైర్మ‌న్ క‌రుణాక‌ర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌స్తుత టీటీడీ చైర్మ‌న్ గా ఉన్న బీఆర్ నాయుడు వ్య‌వ‌హార శైలిపై, అనుస‌రిస్తున్న తీరు ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. తాజాగా టీటీడీ చైర్మ‌న్ రాస‌లీల‌ల వ్య‌వ‌హరానికి సంబంధించిన ప‌లు వీడియోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అవి పెద్ద ఎత్తున ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. అంతే కాకుండా సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. త‌ను ఇత‌ర మ‌హిళ‌ల‌తో చాలా స‌న్నిహితంగా ఉంటున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. అయితే ఆ వీడియోలు త‌న‌వి కావ‌ని, అంతా ఫేక్ అంటూ పేర్కొన్నారు, ఖండించారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు.
ఈ మొత్తం వ్య‌వహారం క‌ల‌క‌లం రేపుతోంది. ఈ త‌రుణంలో ఆదివారం క‌రుణాక‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆ వీడియోలు నిజ‌మైన వీడియోలేన‌ని అన్నారు. త‌న కామ‌క్రీడ‌ల వీడియోలు బ‌య‌ట‌కు రాగానే డీప్ ఫేక్ అంటున్నాడంటూ బీఆర్ నాయుడుపై భ‌గ్గుమ‌న్నారు. ఆ వీడియోల‌ను ఏఐ సాంకేతిక‌త‌ను ఉప‌యోగించి తయారు చేశారంటూ ఆరోపించారు క‌రుణాక‌ర్ రెడ్డి. ఈ వీడియోల‌కు సంబంధించి తాను కొంద‌రు ఏఐ నిపుణుల‌తో మాట్లాడాన‌ని, అవి క‌రెక్టేన‌ని చెప్పార‌న్నారు. బీఆర్ నాయుడుకి సిగ్గు ఉంటే.. మౌనంగా రాజీనామా చేసి పక్కకు వెళ్లాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోగా తన వర్గపు మీడియా ద్వారా ఎదురుదాడి చేయటం సిగ్గుచేటు అని పేర్కొన్నారు టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి.
The post నాయుడు ర‌సికుడే రాజీనామా చేయాల్సిందే appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

రాష్ట్రాభివృద్ధికి వైసీపీ వైరస్‌లా మారిందిరాష్ట్రాభివృద్ధికి వైసీపీ వైరస్‌లా మారింది

మంగ‌ళ‌గిరి : ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అన‌గాని స‌త్య ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న సోమ‌వారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అల్లర్లు, అశాంతి సృష్టించేలా జగన్ సైకో ముఠా కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధికి వైసీపీ, జగన్ వైరస్‌లా

YV Subba Reddy: కల్తీ నెయ్యి కేసులో ముగిసిన వైవీ సుబ్బారెడ్డి విచారణYV Subba Reddy: కల్తీ నెయ్యి కేసులో ముగిసిన వైవీ సుబ్బారెడ్డి విచారణ

  తిరుమల శ్రీవారు లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంలో టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సిట్ విచారణ పూర్తయింది. గురువారం నాడు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌‌లోని ఆయన నివాసంలో సిట్ అధికారులు దాదాపు ఏడు గంటలపాటు విచారించారు.