hyderabadupdates.com Gallery నాయుడు ర‌సికుడే రాజీనామా చేయాల్సిందే

నాయుడు ర‌సికుడే రాజీనామా చేయాల్సిందే

నాయుడు ర‌సికుడే రాజీనామా చేయాల్సిందే post thumbnail image

తిరుప‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి మాజీ చైర్మ‌న్ క‌రుణాక‌ర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌స్తుత టీటీడీ చైర్మ‌న్ గా ఉన్న బీఆర్ నాయుడు వ్య‌వ‌హార శైలిపై, అనుస‌రిస్తున్న తీరు ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. తాజాగా టీటీడీ చైర్మ‌న్ రాస‌లీల‌ల వ్య‌వ‌హరానికి సంబంధించిన ప‌లు వీడియోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అవి పెద్ద ఎత్తున ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. అంతే కాకుండా సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. త‌ను ఇత‌ర మ‌హిళ‌ల‌తో చాలా స‌న్నిహితంగా ఉంటున్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి. అయితే ఆ వీడియోలు త‌న‌వి కావ‌ని, అంతా ఫేక్ అంటూ పేర్కొన్నారు, ఖండించారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు.
ఈ మొత్తం వ్య‌వహారం క‌ల‌క‌లం రేపుతోంది. ఈ త‌రుణంలో ఆదివారం క‌రుణాక‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆ వీడియోలు నిజ‌మైన వీడియోలేన‌ని అన్నారు. త‌న కామ‌క్రీడ‌ల వీడియోలు బ‌య‌ట‌కు రాగానే డీప్ ఫేక్ అంటున్నాడంటూ బీఆర్ నాయుడుపై భ‌గ్గుమ‌న్నారు. ఆ వీడియోల‌ను ఏఐ సాంకేతిక‌త‌ను ఉప‌యోగించి తయారు చేశారంటూ ఆరోపించారు క‌రుణాక‌ర్ రెడ్డి. ఈ వీడియోల‌కు సంబంధించి తాను కొంద‌రు ఏఐ నిపుణుల‌తో మాట్లాడాన‌ని, అవి క‌రెక్టేన‌ని చెప్పార‌న్నారు. బీఆర్ నాయుడుకి సిగ్గు ఉంటే.. మౌనంగా రాజీనామా చేసి పక్కకు వెళ్లాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోగా తన వర్గపు మీడియా ద్వారా ఎదురుదాడి చేయటం సిగ్గుచేటు అని పేర్కొన్నారు టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి.
The post నాయుడు ర‌సికుడే రాజీనామా చేయాల్సిందే appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

వ‌న్య ప్రాణుల సంర‌క్ష‌ణ కోసం ‘హ‌నుమాన్’ కార్య‌క్రమంవ‌న్య ప్రాణుల సంర‌క్ష‌ణ కోసం ‘హ‌నుమాన్’ కార్య‌క్రమం

అమ‌రావ‌తి : మనుషులకీ వన్య ప్రాణులకీ మధ్య సంఘర్షణ నివారణకు ‘హనుమాన్’ ఫౌండేషన్ ప‌ని చేస్తుంద‌ని అన్నారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. అటు వన్యప్రాణులు, ఇటు ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ ఫౌండేష‌న్ ప్ర‌ధాన క‌ర్త‌వ్య‌మ‌ని పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం హనుమాన్

Fire Accident: బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం ! ఆరుగురు సజీవ దహనం !Fire Accident: బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం ! ఆరుగురు సజీవ దహనం !

    డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాయవరంలోని గణపతి గ్రాండ్‌ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. దీనితో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో చిక్కుకుని ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో నలుగురు

ఆట‌గాళ్ల ఆట‌తీరుపై గౌతం గంభీర్ అసంతృప్తిఆట‌గాళ్ల ఆట‌తీరుపై గౌతం గంభీర్ అసంతృప్తి

చెన్నై : త‌మిళ‌నాడులో క్రికెట్ ఫీవ‌ర్ అలుముకుంది. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అత్యంత కీల‌క‌మైన మ్యాచ్ కు వేదిక కానుంది రాష్ట్ర రాజ‌ధాని చెన్నై లోని స్టేడియం. ఇదిలా ఉండ‌గా సూప‌ర్ -8లో భాగంగా భార‌త జ‌ట్టు జింబాబ్వేతో