hyderabadupdates.com Gallery నీటి భ‌ద్ర‌త, సంర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త‌

నీటి భ‌ద్ర‌త, సంర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త‌

నీటి భ‌ద్ర‌త, సంర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త‌ post thumbnail image

అనంత‌పురం జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క సూచ‌న‌లు చేశారు నీటి భ‌ద్ర‌త గురించి. సోమ‌వారం అనంత‌పురం జిల్లా తాడిప‌త్రిలో రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కోసం చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ ‘#జలధార’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చెరువుల పూడికతీత, కాల్వల మరమ్మతులు, భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణే ధ్యేయంగా ప్రతి ఎకరాకు నీరు, ప్రతి రైతుకు భరోసా కల్పించేలా జలధార కార్యక్రమాన్ని రూపొందించాం అన్నారు. నీటి సంరక్షణ కోసం ప్రజా ఉద్యమం ప్రారంభించాం అని అన్నారు సీఎం. 60 వేల మంది సాగునీటి సంఘాల సభ్యుల సారథ్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. 2024లో అనంతపురం జిల్లాలో 13.36 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు సమర్థ నీటి నిర్వహణ ద్వారా 2.11 మీటర్ల మేర పెరిగింద‌ని, నేడు 11.25 మీటర్లకు చేరుకున్నాయని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు.
నీరు ఉంటేనే అభివృద్ధి, పరిశ్రమలు, సంక్షేమం-సంపద వ‌స్తుంద‌న్నారు. ఒకప్పుడు ఎడారిగా మారుతుంది అని అంతా భయపడిన ఉమ్మడి అనంతపురం జిల్లా నేడు నీటి నిర్వహణ, సంరక్షణ చర్యలతోనే ఉద్యాన రంగంలో అగ్రగామిగా ఉందన్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు, ప్రభుత్వ అధికారులు, సాగునీటి సంఘాలు కలిసి అడుగేసి రానున్న రోజుల్లో భూగర్భ జలాలు పెంపుతో రికార్డులు సృష్టించాలని పిలుపునిచ్చారు. నీరు మనందరికీ సర్వస్వం… దానిని సంరక్షించుకోడానికే వంద రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టమ‌ని ప్ర‌క‌టించారు సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కోసమే పని చేస్తున్నాం అని చెప్పారు.
The post నీటి భ‌ద్ర‌త, సంర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆ ఇద్ద‌రికి అంకితంటి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆ ఇద్ద‌రికి అంకితం

అహ్మ‌దాబాద్ : త‌న శిక్ష‌ణ‌లో రాటు దేలిన భార‌త జ‌ట్టు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా నిలవ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు కోచ్ గౌతం గంభీర్. ఈ క‌ప్ ను ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు అంకితం ఇస్తున్నాన‌ని

టీడీపీ శ్రేణులు సంయ‌మ‌నం పాటించాలిటీడీపీ శ్రేణులు సంయ‌మ‌నం పాటించాలి

మంగ‌ళ‌గిరి : రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు దాడుల‌కు దిగ‌వ‌ద్ద‌ని , కాస్త సంయ‌మ‌నం పాటించాల‌ని సూచించారు టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస రావు. సోమ‌వారం మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పార్టీ జాతీయ అధ్య‌క్షుడు , సీఎం

MLA Mukul Roy: పార్టీ ఫిరాయించిన బెంగాల్‌ ఎమ్మెల్యే ముకుల్‌ రాయ్‌ సభ్యత్వం రద్దుMLA Mukul Roy: పార్టీ ఫిరాయించిన బెంగాల్‌ ఎమ్మెల్యే ముకుల్‌ రాయ్‌ సభ్యత్వం రద్దు

  బీజేపీ టిక్కెట్‌పై గెలిచి తృణమూల్‌ కాంగ్రె‌స్ లోకి మారిన సీనియర్‌ నాయకుడు ముకుల్‌ రాయ్‌ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ గురువారం కలకత్తా హైకోర్టు తీర్పు ఇచ్చింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని సెక్షన్ల ప్రకారం ఆయనను జస్టిస్‌ దేబాంగ్సు