hyderabadupdates.com Gallery పైసా అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ

పైసా అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ

పైసా అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాము ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టామ‌న్నారు. పూర్తి పార‌దర్శ‌క‌తో పాల‌న సాగిస్తున్నామ‌ని చెప్పారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశామ‌న్నారు. భవిష్యత్ లో ఎవరూ ప్రజల భూమిపై కన్ను వేయకుండా భద్రత కల్పిస్తున్నాం అని పేర్కొన్నారు. ప్రతీ పాస్ పుస్తకానికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్, యూనిక్ నెంబర్ ఉంటుందన్నారు. ఎవరైనా సరే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా భూమి వివరాలను వెంటనే తెలుసుకోవచ్చు అని చెప్పారు సీఎం. మీ పాసు పుస్తకంలో ఉన్న క్యూఆర్ కోడ్ ను మీ ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే అందులో వచ్చే మ్యాప్ మిమ్మల్ని నేరుగా మీ పొలం వద్దకు తీసుకు వెళుతుందని అన్నారు. డాక్యుమెంట్ల వివరాలను ట్యాంపర్ చేయకుండా బ్లాక్ చైన్ లాంటి పటిష్ట వ్యవస్థను తెస్తున్నాం అని ప్ర‌క‌టించారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత. మీ రికార్డులన్నీ మీ అనుమతితోనే చేస్తున్నాం అన్నారు చంద్ర‌బాబు నాయుడు.
ముందుగా డ్రాఫ్ట్ పట్టా దార్ పాస్‌బుక్ జారీ చేసి అందులో వ్యక్తిగత వివరాలు, భూమి వివరాలు సరిగ్గా ఉన్నాయో, లేవో భూ యజమానులు నిర్ధారించుకునే అవకాశం ఇచ్చాం అని తెలిపారు. ఈ కేవైసీ ధృవీకరణ తప్పనిసరిగా తీసుకుంటున్నాం అని పేర్కొన్నారు. దీంతో తప్పులు దొర్లేందుకు వీలుపడదని అన్నారు. పైసా అవినీతి లేకుండా పట్టాదారు పుస్తకాలు ఇస్తున్నాం అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు గ్రామాల చొప్పున రాష్ట్రంలో మొత్తం 279 గ్రామాల్లో ముందుగా పంపిణీ చేపట్టాం అని చెప్పారు సీఎం. ప్రస్తుతం 1,16,870 డ్రాఫ్ట్ పాస్‌ బుక్స్ సిద్ధంగా ఉన్నాయి. వీటిలో 91,038 డ్రాఫ్ట్ పాస్‌ బుక్స్ eKYC కూడా పూర్తయ్యింది. కర్నూలు జిల్లాలోని 13 గ్రామాల్లో 8,347 మందికి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. కలుగట్ల గ్రామంలో 1,178 కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేసుకుంటున్నాం. ఇప్పటి వరకూ 37 లక్షల 40 వేల పట్టా దారు పాస్ పుస్తకాలు సిద్ధమయ్యాయ‌ని తెలిపారు.
ఇందులో 19 లక్షలు లక్షలు ఇప్పటికే పంపిణీ చేయగా..18 లక్షల 40 వేలు ఏప్రిల్ లోగా పంపిణీ చేస్తాం. ఇది కాకుండా 9,500 గ్రామాల్లో సర్వే చేయాల్సి ఉంద‌న్నారు. అవి చేస్తే 60 లక్షల మందికి కొత్తగా పాస్ పుస్తకాలు ఇచ్చే అవకాశం వస్తుంద‌న్నారు. 2027 డిసెంబర్ నాటికి ప్రతి ఒక్కరికీ పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని చెప్పారు చంద్ర‌బాబు నాయుడు. జాయింట్ ఎల్పీఎంల విషయంలో వివాదాలు పరిష్కరించు కోవాలని సూచించారు. ఈ కార్య‌క్రమంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్, ఎంపీ నాగరాజు, స్థానిక ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డి, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
The post పైసా అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

రామ్ పోతినేని అంటే చ‌చ్చేంత ఇష్టంరామ్ పోతినేని అంటే చ‌చ్చేంత ఇష్టం

హైద‌రాబాద్ : బిగ్ బాస్ స్టార్ శ్రీ స‌త్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌ముఖ హీరో రామ్ పోతినేని గురించి తాజాగా స్పందించింది. త‌నంటే చాలా ఇష్ట‌మ‌ని, త‌ను లేకుండా నేను ఉండ‌లేనంటూ పేర్కొంది శ్రీ స‌త్య‌. అంతే కాదు త‌న‌కున్న

1.55 కోట్ల మంది భ‌క్తుల‌ మేడారం జాత‌ర ద‌ర్శ‌నం1.55 కోట్ల మంది భ‌క్తుల‌ మేడారం జాత‌ర ద‌ర్శ‌నం

ములుగు జిల్లా : ఈసారి జ‌రిగిన మేడారం జాత‌ర‌ను రికార్డు స్థాయిలో 1.55 కోట్ల మంది భక్తులు ద‌ర్శించుకున్నారు. ఈ విష‌యాన్ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి వెల్ల‌డించారు. త‌ను మంత్రి దాస‌రి సీత‌క్క‌తో క‌లిసి ప‌ర్య‌టించారు మేడారాన్ని. ఈ సందర్భంగా

CM Chandrababu: అమరావతిలో గ్రంథాలయ నిర్మాణానికి శోభా గ్రూప్‌ రూ.100 కోట్ల విరాళంCM Chandrababu: అమరావతిలో గ్రంథాలయ నిర్మాణానికి శోభా గ్రూప్‌ రూ.100 కోట్ల విరాళం

  ఏపీ రాజధాని అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంథాలయ నిర్మాణానికి శోభా గ్రూప్ విరాళం ప్రకటించింది. శోభా గ్రూప్ సంస్థ అమరావతిలో ప్రపంచ స్థాయి స్టేట్ లైబ్రరీ నిర్మించేందుకు ముందుకు రావటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.