hyderabadupdates.com movies ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కేసీఆర్

తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను కూడా ఈ కేసులో విచారణ జరిపేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన సిట్ అధికారులు… కేసీఆర్ పీఏకు నోటీసులిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

అయితే, వయసు దృష్ట్యా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు విచారణకు కేసీఆర్ రావాల్సిన అవసరం లేదని సిట్ అధికారులు తెలిపారు. 65 ఏళ్లు పైబడిన వారు పోలీస్ స్టేషన్ కు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన అవసరం లేదని సీఆర్పీసీ 160 చట్టంలో ఉందని, కాబట్టి కేసీఆర్ కోరుకున్న చోట విచారణ జరుపుతామని సిట్ అధికారులు తెలిపారు.

అయితే, ఆ ప్రదేశం హైదరాబాద్ నగర పరిధిలో ఉండాలని పేర్కొంది. కేసీఆర్ ఎక్కడ విచారణ జరగాలని కోరుకుంటున్నారో అన్న విషయాన్ని తమకు ముందస్తుగా తెలియజేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరబాద్ నగర పరిధిలో అని అన్నారు కాబట్టి నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరిగే అవకాశముంది.

Related Post

మంత్రుల తగువుతో హీట్ పెరిగిందిమంత్రుల తగువుతో హీట్ పెరిగింది

తెలంగాణలో రెండు కీలక ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైన వేళ, కాంగ్రెస్ ప్రభుత్వం ఐక్యంగా ముందుకు సాగాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన సూచనలు ఇచ్చారు. కానీ పార్టీ నేతల మధ్య ఐక్యత నినాదం కొనసాగుతున్నా, మంత్రుల మధ్య మాత్రం విభేదాల మంటలు

కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట..9 మంది మృతికాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట..9 మంది మృతి

శ్రీకాకుళంలోని కాశీబుగ్గలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 9 మంది భక్తులు మృతి చెందారు. పదుల సంఖ్యలో భక్తులు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. గాయపడిన భక్తులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య