hyderabadupdates.com Gallery బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌

బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌

బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌ post thumbnail image

హైద‌రాబాద్ : ఓ వైపు అధికారాన్ని కోల్పోయినా బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ వాణిని వినిపిస్తూ వ‌స్తున్న భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) పార్టీ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ కు కంట్లో న‌లుసు లాగా త‌యారైంది త‌న స్వంత, ముద్దుల కూతురు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. శాస‌న మండ‌లిలో ఇవాళ ఆమె సుదీర్ఘ ప్ర‌సంగం చేశారు. అంతే కాదు తాను త‌న శాస‌న మండ‌లి స‌భ్యురాలి ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. గ‌తంలోనే ఇచ్చాన‌ని, కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆమోదించ లేద‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా త‌న రాజీనామా లేఖ‌ను ఆమోదించాల‌ని మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డిని కోరారు. ఇదే స‌మ‌యంలో త‌న‌కు మాట్లాడేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు.
విచిత్రంగా త‌న తండ్రిని, మాజీ మంత్రులు త‌న్నీరు హ‌రీష్ రావు, కేటీఆర్ ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆమె మండ‌లి సాక్షిగా చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. రాజ‌కీయ వ‌ర్గాల‌లో చ‌ర్చ‌కు దారి తీశాయి. ప్ర‌ధానంగా మాజీ మంత్రులు చేసిన అక్ర‌మాల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఇదే స‌మ‌యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి కలెక్టరేట్ భవ‌నాల వరకు అన్నిట్లో అవినీతికీ పాల్పడ్డారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. సిరిసిల్ల, సిద్దిపేట కలెక్టరేట్ భవనాలు ఎంత నాణ్యతతో కట్టారు అంటే కట్టిన మొదటి ఏడాదే నీటిలో మునిగి పోయాయంటూ ఎద్దేవా చేశారు. అమర వీరుల గుర్తుగా కట్టిన అమరజ్యితి నిర్మాణంలో కూడా అవినీతికి పాల్ప‌డ్డారంటూ ఫైయ్యారు.
The post బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

14 నుంచి 16 వ‌ర‌కు ప్ర‌త్యేక బ‌స్సులు : టీజీఎస్ఆర్టీసీ14 నుంచి 16 వ‌ర‌కు ప్ర‌త్యేక బ‌స్సులు : టీజీఎస్ఆర్టీసీ

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ ఎండీ నాగిరెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శివాల‌యాల‌కు పెద్ద ఎత్తున బ‌స్సులు న‌డుపుతున్న‌ట్లు తెలిపారు. మొత్తం 2,243 స్పెష‌ల్ బ‌స్సులు కేటాయించామ‌న్నారు

Minister Nara Lokesh: భారత్‌ లో పెట్టుబడులకు ఏపీ గేట్ వేగా మారింది – మంత్రి లోకేశ్‌Minister Nara Lokesh: భారత్‌ లో పెట్టుబడులకు ఏపీ గేట్ వేగా మారింది – మంత్రి లోకేశ్‌

    భారత్-ఆస్ట్రేలియా వాణిజ్యంలో ఏపీది కీలక పాత్ర అని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. భారత్‌లో పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానంగా ఉందన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న లోకేశ్‌.. బ్రిస్బేన్‌ బిజినెస్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య

Train Accident: ఛత్తీస్‌ గఢ్‌ లోఘోర రైలు ప్రమాదం ! 11 మంది మృతి !Train Accident: ఛత్తీస్‌ గఢ్‌ లోఘోర రైలు ప్రమాదం ! 11 మంది మృతి !

    ఛత్తీస్ గఢ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న గూడ్స్‌ను ప్యాసింజర్‌ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో లోకో పైలట్‌ సహా 11 మంది మృతి చెందగా మరో 20 మంది వరకు