hyderabadupdates.com movies బీజేపీ లోకి మరో సీనియర్ నటి, కారణం ఏంటి?

బీజేపీ లోకి మరో సీనియర్ నటి, కారణం ఏంటి?

తెలుగు సినిమా నటిగా ఆమని అందరికీ సుపరిచితమే. ముఖ్యంగా మిస్టర్ పెళ్ళాం చిత్రం ద్వారా గుర్తింపు పొందారు. దాదాపు అందరి హీరోల పక్కన నటించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహిళ. ఆమని ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

పార్టీలో చేరిన అనంతరం ఆమని మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ ప్రవేశంపై స్పష్టత ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశ ప్రతిష్ఠ అంతర్జాతీయ స్థాయిలో పెరిగిందన్నారు. భారతీయురాలిగా గర్వపడేలా చేసిన ఆయన అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

దేశం కోసం మోదీ చేస్తున్న అభివృద్ధి పనులు, సనాతన ధర్మ పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. కేవలం పదవుల కోసమో, అధికారం కోసమో కాకుండా.. సామాన్య ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతోనే కమల దళంలో చేరాను అని ఆమె వివరించారు.

నటిగా సమాజంలోని వివిధ వర్గాలను దగ్గర నుంచి గమనించిన అనుభవం ఉన్న ఆమనికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గతంలో పలువురు తెలుగు హీరోయిన్లు ఆయా పార్టీలలో చేరి, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కూడా గెలిచారు. ఆ జాబితాలో ఇప్పుడు ఆమని వచ్చి చేరింది. ఆమని రాకతో బీజేపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వస్తుందేమో వేచి చూడాలి.

Related Post

అంచనాలకు తగ్గట్టే అఖండ 2 తాండవంఅంచనాలకు తగ్గట్టే అఖండ 2 తాండవం

హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ సిరీస్ కొనసాగిస్తూ బాలకృష్ణ – బోయపాటి శీను కలయికలో తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం నుంచి మొదటి ఆడియో సింగిల్ వచ్చేసింది. సినిమా విడుదల ఇంకో ఇరవై రోజుల్లో ఉండగా ఇప్పటిదాకా ప్రమోషన్లు మొదలుపెట్టలేదని ఎదురు చూస్తున్న

ఉత్తర భారతం ఉక్కిరిబిక్కిరి.. రాహుల్ ఫైర్ఉత్తర భారతం ఉక్కిరిబిక్కిరి.. రాహుల్ ఫైర్

ఉత్తర భారతం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. గాలి పీల్చడమే ఒక పెద్ద సాహసంగా మారింది. ఈ పరిస్థితులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరినా, ప్రభుత్వం ఎందుకు

మన దేశం పౌరసత్వం కోసం అతను చేసింది త్యాగమేమన దేశం పౌరసత్వం కోసం అతను చేసింది త్యాగమే

విదేశాలకు వెళ్లిన చాలామంది అక్కడి సిటిజన్‌షిప్ కోసం ఆరాటపడుతుంటారు. గ్రీన్ కార్డు కోసమో, పాస్‌పోర్ట్ కోసమో ఏళ్ల తరబడి ఎదురుచూస్తారు. కానీ జర్మనీలో తొమ్మిదేళ్లుగా ఉంటున్న మయూఖ్ పాంజా అనే యువకుడు మాత్రం ఇందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నాడు. తనకు జర్మన్