hyderabadupdates.com Gallery బౌల‌ర్ల ప్ర‌తాపం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజ‌యం

బౌల‌ర్ల ప్ర‌తాపం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజ‌యం

బౌల‌ర్ల ప్ర‌తాపం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజ‌యం post thumbnail image

ల‌క్నో : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 40 ప‌రుగుల తేడాతో ప్ర‌త్య‌ర్థి ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టును ఓడించింది. రెండు ఓట‌ముల త‌ర్వాత ద‌క్కిన విజ‌యం ఇది. ఆతిథ్య జ‌ట్టుకు బిగ్ షాక్ ఇచ్చింది. దీంతో ఈ గెలుపుతో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టీం 2వ ప్లేస్ లోకి వెళ్లింది. ఇక ల‌క్నో ప‌రంగా చూస్తే ఇది వ‌రుస‌గా ఆ జ‌ట్టుకు నాలుగో ప‌రాజ‌యం . ముందుగా బ్యాటింగ్ చేసిన రాజ‌స్తాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 159 ర‌న్స్ మాత్ర‌మే చేసింది. అంద‌రూ ల‌క్నో ఈ చిన్ని టార్గెట్ ను ఈజీగా ఛేదిస్తార‌ని అనుకున్నారు. కానీ ఊహించ‌ని రీతిలో రాజ‌స్తాన్ బౌల‌ర్లు క‌ళ్లు చెదిరే బంతుల‌తో ప‌రేషాన్ చేశారు ల‌క్నో బ్యాట‌ర్ల‌ను. దీంతో 18 ఓవ‌ర్ల‌లోనే 119 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది ల‌క్నో సూపర్ జెయింట్స్ .
రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌ను మిచెల్ మార్ష్ ఒక్కేడు ఎదుర్కొన్నాడు. త‌ను 41 బంతులు ఎదుర్కొని 55 ర‌న్స్ చేశాడు. ఇందులో 6 ఫోర్లు 2 సిక్స్ లు సాధించాడు.త‌నే టాప్ స్కోర‌ర్. ఇక బౌలింగ్ ప‌రంగా మ‌రోసారి ఆర్చ‌ర్ స‌త్తా చాటాడు. త‌ను 4 ఓవ‌ర్లు వేసి 20 ప‌రుగులు చేసి 3 వికెట్లు తీశాడు.బ్రిజేష్, బ‌ర్గ‌ర్ చెరో 2 వికెట్లు కూల్చారు. ఇక రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టులో ర‌వీంద్ర జ‌డేజా ఒక్క‌డే స‌త్తా చాటాడు. య‌శ‌స్వి జైస్వాల్, వైభ‌వ్ సూర్య‌వంశీ లు నిరాశ ప‌రిచారు. వ‌రుస‌గా మ్యాచ్ లు ఓడి పోవ‌డంతో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో 9వ స్తానానికి ప‌డి పోయింది. పూరన్ 22 ర‌న్స్ చేసినా ఫలితం లేకుండా పోయింది.
The post బౌల‌ర్ల ప్ర‌తాపం రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజ‌యం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

శ్రీ‌శైలానికి పోటెత్తిన శివ స్వాములుశ్రీ‌శైలానికి పోటెత్తిన శివ స్వాములు

నంద్యాల జిల్లా : మ‌హా శివ‌రాత్రి పర్వ‌దినం సంద‌ర్బంగా భారీ ఎత్తున భ‌క్తులు శ్రీ‌శైలం క్షేత్రానికి రానున్నార‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు తెలిపారు నంద్యాల ఎస్పీ . గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం నందు ప్రశాంత వాతావరణంలో భక్తుల దర్శన ఏర్పాట్లు

ఉపాధి ప‌థ‌కాన్ని య‌థాత‌థంగా అమ‌లు చేయాలిఉపాధి ప‌థ‌కాన్ని య‌థాత‌థంగా అమ‌లు చేయాలి

హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు కేంద్రంలోని మోదీ బీజేపీ స‌ర్కార్ పై. కావాల‌ని పేద‌ల‌కు ప‌నికి వ‌చ్చే ప‌థ‌కాల‌ను అన్నింటిని ఒక ప‌థ‌కం ప్ర‌కారం నిర్వీర్యం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తోందంటూ ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

Nara Bhuvaneshwari: ‘డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025’ అవార్డు అందుకున్న నారా భువనేశ్వరిNara Bhuvaneshwari: ‘డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025’ అవార్డు అందుకున్న నారా భువనేశ్వరి

    ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్ఠాత్మక ‘డిస్టింగ్విష్డ్‌ ఫెలోషిప్‌-2025’ అందుకున్నారు. లండన్‌లోని గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 1.30 సమయంలో జరిగిన కార్యక్రమంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ (ఐవోడీ) సంస్థ ప్రతినిధులు