hyderabadupdates.com Gallery మరణానంతరం పార్థివ దేహం స్విమ్స్ కు

మరణానంతరం పార్థివ దేహం స్విమ్స్ కు

మరణానంతరం పార్థివ దేహం స్విమ్స్ కు post thumbnail image

తిరుపతి : టిటిడి మహిళా సంక్షేమ విభాగానికి చెందిన అధ్యక్షురాలు, ఆడిట్ విభాగం సూపరింటెండెంట్ కట్టమంచి ఇందిర మరణానంతరం తన పార్థివ దేహం స్విమ్స్ – శ్రీ పద్మావతి మెడికల్ కళాశాలకు డొనేషన్ ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ మేరకు టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ను కలిసి అఫిడవిట్ ను అందజేశారు. ఈ సందర్భంగా కె. ఇందిర మాట్లాడుతూ గత నవంబర్ 15వ తేదీన తన భర్త డా. కె. శివాజీ పలు కార్పోరేట్ కాలేజీలలో ఫ్యాకల్టీగా పనిచేశారని, తాను చనిపోయినా విద్యార్థులకు ఉపయోగపడాలనే సదుద్దేశ్యంతో మరణానంతరం తన భర్త పార్థివ దేహం మెడికల్ కాలేజీకి డొనేషన్ చేశామన్నారు. తన భర్త కోరిక మేరకు తాను చనిపోయాక తన పార్థివ దేహం మెడికల్ కాలేజీ విద్యార్థులకు ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో అందుకు సంబంధించిన అఫిడవిట్ ను టిటిడి ఈవోకు అందజేశారు.
కె. ఇందిర నిర్ణయాన్ని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అభినందించారు. మరణానంతరం పార్థీవ దేహం మట్టిలో కలిసిపోవడం కన్నా మెడికల్ విద్యార్థులకు ఉపయోగపడేలా కె. ఇందిర నిర్ణయం తీసుకోవడం హర్షణీయం అని తెలిపారు. అందుకు సంబంధించిన అఫిడవిట్ ను పద్మావతి మెడికల్ కళాశాల అనాటమి డిపార్ట్ మెంట్ అధికారులకు టిటిడీ ఈవో పంపించారు. గతంలో తిరుపతిలోని లీలా మహల్ వద్ద భార్యా భర్తలిద్దరూ కార్పొరేట్ స్కూలు స్థాపించారు. ఎంతోమంది విద్యార్థులకు తక్కువ ఫీజులతో చదువు చెప్పించడంతో పాటు కొంత మందికి ఉపాధి చూపించవచ్చు అనే ఉద్దేశ్యంతో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి స్కూలును స్థాపించారు.
The post మరణానంతరం పార్థివ దేహం స్విమ్స్ కు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

మెగాస్టార్ బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ క‌లెక్ష‌న్స్ సూప‌ర్మెగాస్టార్ బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్ క‌లెక్ష‌న్స్ సూప‌ర్

హైద‌రాబాద్ : మెగాస్టార్ చిరంజీవి, అందాల తార న‌య‌న‌తార , విక్ట‌రీ వెంక‌టేశ్ క‌లిసి న‌టించిన చిత్రం మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు మూవీ వ‌సూళ్ల వేట కొన‌సాగిస్తోంది. సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా విడుద‌లైన ఈ మూవీ దుమ్ము రేపుతోంది.

KTR: బీఆర్ఎస్, కాంగ్రెస్‌ మధ్యే పోటీ – కేటీఆర్KTR: బీఆర్ఎస్, కాంగ్రెస్‌ మధ్యే పోటీ – కేటీఆర్

    జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక రెండే పార్టీల మధ్య జరుగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఆరు గ్యారంటీలను ఎగ్గొట్టి, పేదవాడి గూడు కూలగొట్టి, వాళ్ల నడుం విరగ్గొట్టి ఉపాధి లేకుండా చేస్తున్న కాంగ్రెస్‌కు… పేదవాడి కోసం ప్రభుత్వాన్ని గల్లా

APCC chief Sharmila threatens fast unto death if Aarogyasri services are not restored immediatelyAPCC chief Sharmila threatens fast unto death if Aarogyasri services are not restored immediately

APCC President YS Sharmila protested at Andhra Ratna Bhavan in Vijayawada on Wednesday demanding the immediate release of Arogya Sri funds in the wake of the government failing to pay Aarogyasri (NTR