hyderabadupdates.com movies మురారి మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి

మురారి మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి

అసలే సంక్రాంతి పోటీ తీవ్రంగా ఉంది. ఒకటి రెండు కాదు ఏకంగా అరడజను సినిమాలు పోటీలో ఉండటం వల్ల ప్రమోషన్ల పరంగా ఎవరికి వారు నువ్వా నేనానే రీతిలో ప్లాన్ చేసుకుంటున్నారు. రాజా సాబ్ హైదరాబాద్ లో ఈవెంట్ చేస్తే మన శంకరవరప్రసాద్ గారు గుంటూరు వెళ్లి మెగా విక్టరీ సాంగ్ లాంచ్ చేసుకున్నారు.

అనగనగా ఒక రాజు భాగ్యనగరం నుంచి భీమవరం దాకా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడికి దూసుకెళ్ళిపోతున్నాడు. భర్త మహాశయులకు విజ్ఞప్తి ఇంత హడావిడి చేయకపోయినా ఉన్నంతలో రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ, పాటలు వదులుతూ సోషల్ మీడియాలో ఏదో ఒక సౌండ్ ఉండేలా చూసుకుంటోంది.

ఇక పండగ బరిలో అందరికంటే లాస్ట్ వస్తున్న నారి నారి నడుమ మురారి కొంచెం మౌనం, ఎక్కువ శబ్దం తరహాలో నెమ్మదిగా వెళ్తోంది. అయిదు రోజుల ముందు రచయిత భాను భోగవరపుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన తర్వాత మళ్ళీ ఏ అప్డేట్ లేదు. ఆ పోస్టర్ లో కూడా విడుదల తేదీ లేకపోవడం గమనించాల్సిన విషయం.

ఇంతకు ముందు జనవరి 14 సాయంత్రం ప్రీమియర్లతో విడుదల ఉంటుందని టైం, ముహూర్తంతో సహా ప్రకటించిన టీమ్ ఇప్పుడీ తేదీని మాయం చేయడం వెనుక మర్మం ఏమిటో అంతు చిక్కడం లేదు. పబ్లిసిటీలో ఇలా అయిదేసి రోజులు గ్యాప్ ఇవ్వడం ఎంత మాత్రం సేఫ్ కాదు.

సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన నారి నారి నడుమ మురారిలో సాక్షి వైద్య, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. కాకతాళీయంగా రవితేజ మూవీతో పాటు ఇందులోనూ డబుల్ హీరోయిన్ల మధ్య నలిగిపోయే సింగల్ హీరో ఫార్ములా ఉండటం అసలు ట్విస్ట్.

పండగ బరిలో ఉండటం ఫిక్స్ అనుకుంటే మాత్రం శర్వానంద్ బృందం ఇంకేదో స్పెషల్ అనిపించేది చేయాలి. కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా కాంపిటీషన్ ని మరీ తక్కువంచనా వేయకూడదు. ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చారు.

Related Post

విజయ్ వీడ్కోలు… ప్లానింగ్ గట్టిగానేవిజయ్ వీడ్కోలు… ప్లానింగ్ గట్టిగానే

తమిళంలో ఓ మూడు దశాబ్దాలకు పైగా తిరుగులేని నంబర్ వన్ హీరోగా కొనసాగాడు సూపర్ స్టార్ రజినీకాంత్. తమిళనాడును దాటి విస్తరించిన ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్‌ను ఎవ్వరూ అందుకునే పరిస్థితి కనిపించలేదు. సినిమాల్లో కొనసాగినంత కాలం రజినీనే నంబర్ వన్

కాంగ్రెస్ వ‌దుల‌కుంది.. మోడీ ఓన్ చేసుకున్నారు!కాంగ్రెస్ వ‌దుల‌కుంది.. మోడీ ఓన్ చేసుకున్నారు!

రాజ‌కీయాల్లో ఏ చిన్న అవ‌కాశం వ‌చ్చినా.. ప్ర‌త్య‌ర్థులు దానిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటారు. ముఖ్యంగా జాతీయ రాజ‌కీయాల్లో 2014 త‌ర్వాత అనేక మార్పులు సంత‌రించుకున్నాయి. ప్ర‌ధాని పీఠంపై కూర్చున్న న‌రేంద్ర‌ మోడీ.. వ్యూహాత్మ‌క అడుగులు వేయ‌డంలో త‌న‌కు తానే సాటి అనిపించుకున్నారు.

బోరుగడ్డ అనిల్… అదంతా చేసింది ఎంపీ సీటు కోసమా?బోరుగడ్డ అనిల్… అదంతా చేసింది ఎంపీ సీటు కోసమా?

బోరుగడ్డ అనిల్.. ఏపీ రాజకీయాల్లో తరచుగా వినపడే పేరది. గత వైసీపీ పాలనలో జగన్ సానుభూతిపరుడిగా గుర్తింపు పొందిన ఆయన ఏకంగా చంద్రబాబు, పవన్కల్యాణ్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. జగన్ జమానాలో ఆయన నోటికి అదుపు లేకుండా పోయింది. ఏకంగా