hyderabadupdates.com movies మెగా జోష్ తీసుకొచ్చిన వరప్రసాద్ వేడుక

మెగా జోష్ తీసుకొచ్చిన వరప్రసాద్ వేడుక

మన శంకరవరప్రసాద్ గారు ప్రమోషన్లలో చివరి ఘట్టం పూర్తయ్యింది. హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. నాలుగు దశాబ్దాలకు పైగా నట ప్రయాణంలో ఈ ఇద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఇంత టైం పట్టడం ఆశ్చర్యమే అయినా, అనిల్ రావిపూడి లాంటి ఎంటర్ టైనింగ్ దర్శకుడి ద్వారా అది జరగడం అభిమానులకు మరింత కిక్ ఇస్తోంది.

ఇక వేడుకలో అట్రాక్షన్లు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా హుక్ స్టెప్ ని లాంచ్ చేయడం, అందులో మెగాస్టార్ వింటేజ్ స్టెప్స్ కనిపించడం ఆడిటోరియంలో ఉన్న ఫ్యాన్స్ ని ఊపేసింది.

ఆ పాట ప్లే అవుతున్నప్పుడు చిరంజీవికి దగ్గరగా వెంకటేష్, అనిల్ రావిపూడి ఆనందంతో డాన్స్ చేయడం, ఆ తర్వాత చిరు వెంకీ ఆత్మీయంగా కౌగిలించుకోవడం మరో మెయిన్ అట్రాక్షన్ గా నిలిచింది.

ప్రసంగాల విషయానికి వస్తే తమ్ముళ్లు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తో నటించానని, ఇప్పుడు అన్నయ్య చిరంజీవితో నటించడం గురించి వెంకటేష్ తన ఆనందాన్ని పంచుకున్నారు. సంక్రాంతికి వస్తున్న రవితేజ, శర్వానంద్, నవీన్ పోలిశెట్టి, ప్రభాస్ ఇలా అందరి సినిమాలు సూపర్ హిట్ అవ్వాలని, అప్పుడే పరిశ్రమ సుభిక్షంగా ఉంటుందని చిరంజీవి తన ఆకాంక్షను వెలిబుచ్చడం మరో ముఖ్యమైన విషయం.

అందరి సినిమాలు బాగా ఆడాలనే ఉద్దేశంతో మెగా విక్టరీ సాంగ్ లో లిరిక్స్ ని మార్చడం గురించి చిరంజీవి ప్రస్తావించడం మరో హైలైట్. ఇద్దరితో ఫుల్ లెన్త్ మల్టీస్టారర్ చేయాలనే కోరిక రావిపూడి స్టేజి మీద వ్యక్తం చేస్తే దానికి మెగాస్టార్ నుంచి సానుకూల సంకేతం రావడం గమనించాల్సిన అంశం.

మీసాల పిల్ల పాట, తోటి నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి విడమరిచి చెప్పిన చిరంజీవి చాలా హుషారుగా యూత్ ఫుల్ గా కనిపించారు. మొత్తానికి మెగా విక్టరీ ఈవెంట్ ఫ్యాన్స్ కి కావాల్సిన జోష్ అయితే ఇచ్చింది. ఇక జనవరి 12 థియేటర్లలో జరగబోయే సంబరాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి.

Related Post

Billy Magnussen & Alexandra Shipp in ‘Violent Ends’ Revenge Trailer
Billy Magnussen & Alexandra Shipp in ‘Violent Ends’ Revenge Trailer

“Bad blood runs deep.” IFC has revealed the official trailer for a revenge thriller film titled Violent Ends, an indie creation written and directed by John-Michael Powell as his second

పాక్ నక్క బుద్ధి… నష్టం తట్టుకోలేరుపాక్ నక్క బుద్ధి… నష్టం తట్టుకోలేరు

టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను మాత్రం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఐసీసీ బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చినందుకు నిరసనగా, బంగ్లాకు మద్దతు