hyderabadupdates.com movies మోడీ సర్కార్ ‘బొగ్గు’ సలహాలు

మోడీ సర్కార్ ‘బొగ్గు’ సలహాలు

ప్ర‌స్తుతం నెల‌కొన్న వంట గ్యాస్ సంక్షోభం నుంచి బ‌య‌ట ప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని చెబుతున్న కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు.. తాజాగా దేశ ప్ర‌జ‌ల‌కు కీల‌క సూచ‌న చేసింది. బొగ్గులు, కిరోసిన్ పొయ్యిల‌ను పెట్టుకోవాల‌ని పేర్కొంది. దేశంలో ఆక‌లి చావులను అరిక‌ట్టేందుకు త‌క్ష‌ణ‌చ‌ర్య‌లుగా ఈ నిర్ణ‌యం తీస‌కున్నామ‌ని పెట్రోలియం శాఖ పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఒక్క వంటిళ్ల‌కు మాత్ర‌మే కాదు.. వాణిజ్య‌, హోట‌ళ్లు, రెస్టారెంట్లు స‌హా.. అన్ని వ్యాపార సంస్థ‌ల‌కు కూడా ఈ సూచ‌న‌లు చేసింది. కిరోసిన్, బొగ్గులు, పిడ‌క‌లు, స‌హా.. ఇత‌ర సంప్ర‌దాయ వ‌న‌రులైన‌.. క‌ట్టెల పొయ్యిల‌ను కూడా వాడుకోవాల‌ని పేర్కొంది.

రాష్ట్రాల‌కు ఆదేశం..

దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా.. త‌మ ప్ర‌జ‌ల‌ను సంప్ర‌దాయ ఇంధ‌న వ‌న‌రులైన బొగ్గులు, కిరోసిన్‌, పిడ‌క‌లు, క‌ట్టెల పొయ్యి ల‌కు మ‌ళ్లేలాచ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్రం కోరింది. అంతేకాదు.. రాష్ట్రాల‌కు కేటాయిస్తున్న కిరోసిన్‌ను 48 వేల కిలో లీట‌ర్లు అదనంగా కేటాయించ‌నున్న‌ట్టు తెలిపింది. ప్ర‌స్తుతం ల‌క్ష కిలో లీట‌ర్లు కేటాయిస్తున్నారు. అయితే.. గ్యాస్ కొర‌త నెల‌కొన్న నేప‌థ్యం లో ఈ కేటాయింపును మ‌రో 48 వేల కిలో లీట‌ర్ల‌కు పెంచుతున్నామ‌ని తెలిపింది. జ‌నాభా ఆధారంగా ఈ పెంపు, కేటాయింపులు ఉంటాయ‌ని పేర్కొంది. మ‌రోవైపు.. గ్యాస్ కొర‌త రాకుండా.. 30 శాతం మేర‌కు ఉత్ప‌త్తులు పెంచామ‌ని వెల్ల‌డించింది.

బ్లాక్ మార్కెట్‌పై ఉక్కుపాదం!

దేశ‌వ్యాప్తంగా వంట‌గ్యాస్ సిలిండ‌ర్ల‌ను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న‌ట్టు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని కేంద్ర పెట్రోలియం స‌హ‌జ వాయువు మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. దీనిని ఎట్టి ప‌రిస్థితిలోనూ స‌హించేది లేద‌ని తెలిపింది. ఉక్కుపాదం మోపాల‌ని రాష్ట్రాల‌ను ఆదేశించింది. అదేస‌మ‌యంలో వినియోగ‌దారుల‌కు ఎక్క‌డా లోటు రాకుండా చూడాల‌ని కోరింది.

అంతేకాదు.. రేష‌న్ దుకాణాల్లో కిరోసిన్‌ను అందుబాటులోకి తీసుకురావాల‌ని.. ప్ర‌తికుటుంబానికీ..(దుకాణాల‌కు వ‌చ్చేవారికి) 5 లీట‌ర్ల చొప్పున త‌క్ష‌ణం ఇవ్వాల‌ని సూచించింది. ఇక‌, వాణిజ్య హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌లోనూ గాడి పొయ్యిల‌ను ఏర్పాటు చేసుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది.

ఇదేస‌మ‌యంలో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ పేరుతో సంస్థ‌లు చేసే దాడుల‌ను నిలువ‌రించాల‌ని.. కేంద్రం పేర్కొంది. ప‌ర్యావ‌ర‌ణ సంస్థ‌లు నెల రోజుల పాటు.. ఈ విష‌యంపై మౌనం పాటించాల‌ని ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితుల నుంచి బ‌య‌ట ప‌డే వ‌ర‌కు ఎలాంటిదాడులు చేయొద్ద‌ని పేర్కొంది. ప్ర‌జ‌ల‌కు ఆహారం అందించ‌డంతోపాటు.. వారు జీవించేలా చేయ‌డం ప్ర‌భుత్వ త‌క్ష‌ణ క‌ర్త‌వ్యంగా పేర్కొంది. ఇదేస‌మ‌యంలో  గ్యాస్ కొర‌త స‌హా.. బొగ్గు, కిరోసిన్ వినియోగంపై విమ‌ర్శ‌లు చేసేవారిని ఉపేక్షించ‌వ‌ద్ద‌ని కూడా రాష్ట్రాల‌ను ఆదేశించ‌డం గ‌మ‌నార్హం.

Related Post

Shraddha Kapoor in talks to join Allu Arjun for Lokesh Kanagaraj’s AA23? Here’s what we knowShraddha Kapoor in talks to join Allu Arjun for Lokesh Kanagaraj’s AA23? Here’s what we know

However, a report by tracker Mukil Vardhanan stated that the actor-director duo is planning to commence shooting for AA23 in June or July 2026, with pre-production underway. Moreover, Lokesh Kanagaraj

ఐబొమ్మ ర‌వి రాబిన్ హుడ్డా… నాగ‌వంశీ అస‌హ‌నంఐబొమ్మ ర‌వి రాబిన్ హుడ్డా… నాగ‌వంశీ అస‌హ‌నం

టాలీవుడ్ నిర్మాత‌ల్లో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీని ఫైర్ బ్రాండ్‌గా చెప్పొచ్చు. సినిమా వేడుక‌లైనా, ఇంట‌ర్వ్యూల్లో అయినా ఆయన చాలా అగ్రెసివ్‌గా, స్ట్రెయిట్‌గా మాట్లాడుతుంటారు. దీని వ‌ల్ల కొన్ని సంద‌ర్భాల్లో నాగ‌వంశీ ఇబ్బంది ప‌డ్డాడు కూడా. అయినా త‌న శైలేమీ మార‌దు. త‌న బేన‌ర్