hyderabadupdates.com movies “యువత ప్రతిభే దేశ బలం”: ప్రధాని మోదీ సమక్షంలో జూపల్లి రాము

“యువత ప్రతిభే దేశ బలం”: ప్రధాని మోదీ సమక్షంలో జూపల్లి రాము

న్యూ ఢిల్లీ వేదికగా మార్చి 23, 24 తేదీల్లో ఘనంగా నిర్వహించిన TV9 నెట్‌వర్క్ ప్రతిష్టాత్మక ‘What India Thinks Today (WITT) 2026’ సమ్మిట్‌లో మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి రాము రావు ప్రసంగం అందరినీ ఆకర్షితులను చేసింది. ఈ సమ్మిట్‌కు ముఖ్య అతిథిగావిచ్చేసిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆయన హృదయపూర్వక స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా రాము రావు జూపల్లి మాట్లాడుతూ.. భారత మానవ వనరుల శక్తి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందుతోందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం “పాలీ క్రైసిస్” వంటి ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, భారత్ మాత్రం స్థిరంగా ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు. దేశ యువతపై ప్రపంచానికి పెరుగుతున్న నమ్మకం, ప్రజాస్వామ్యం, జనాభా శక్తి, వైవిధ్యం వంటి అంశాలు భారత బలాలని స్పష్టం చేశారు.

ప్రస్తుతం భారత్ సుమారు 7 శాతం వృద్ధిరేటుతో ముందుకు సాగుతూ, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా దూసుకెళ్తోందని తెలిపారు. డిజిటల్ మౌలిక సదుపాయాలు, యువతకు అందుతున్న అవకాశాలు దేశాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని చెప్పారు.

భారత మానవ వనరుల శక్తికి ఆధారమైన కీలక అంశాలను కూడా ఆయన వివరించారు:1.యువ జనాభా2.ఆంగ్ల భాషపై పట్టు3.STEM రంగాల్లో ప్రతిభ4.డిజిటల్ సామర్థ్యం & డేటా వినియోగం5.అంతర్జాతీయ అంశాలపై బలమైన అవగాహన6.సాంకేతికతను త్వరగా అలవాటు చేసుకునే నైపుణ్యం 7.సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోగలిగే సామర్థ్యం

ఈ అన్ని అంశాలు కలిసి భారత్‌ను గ్లోబల్ టాలెంట్ హబ్‌గా నిలబెడుతున్నాయని జూపల్లి రాము రావు స్పష్టం చేశారు.

దేశంలో అగ్రగామి న్యూస్ నెట్‌వర్క్ అయిన TV9 నిర్వహించిన ఈ గ్లోబల్ సమ్మిట్‌లో జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, పాలన, ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం, సంస్కృతి, క్రీడలు వంటి విభిన్న అంశాలపై చర్చలు జరిగాయి.ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన కీలక ప్రసంగంలో భారత్‌ గ్లోబల్ స్థాయిలో పెరుగుతున్న ప్రభావాన్ని ప్రస్తావించారు.

గత కొన్ని సంవత్సరాల్లో ప్రపంచ దృష్టిలో భారత్ స్థానం మారిందని, టెక్నాలజీ వినియోగదారుడి నుంచి ఉత్పత్తిదారుగా ఎదిగిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఘర్షణలు, ముఖ్యంగా పశ్చిమ ఆసియా సంక్షోభంపై TV9 నెట్‌వర్క్ కవరేజ్‌ను అభినందించారు. అలాగే, పాలసీ, వ్యాపారం, టెక్నాలజీ రంగాల ప్రముఖులతో భారత్ గ్లోబల్ ప్రయాణం, ఎదుగుదలపై ఈ సమ్మిట్ చర్చలకు వేదికగా నిలుస్తుందని తెలిపారు.

Related Post

ప్రియాంక చోప్రా జ్ఞాపకం ‘అపురూపం’ప్రియాంక చోప్రా జ్ఞాపకం ‘అపురూపం’

పెళ్లి చేసుకుని భర్తతో విదేశాలకు వెళ్ళిపోయిన ప్రియాంకా చోప్రా గురించి తెలుగు మూవీ లవర్స్ మాట్లాడుకునే సందర్భం వస్తుందని ఎవరైనా ఊహించి ఉంటారా. అప్పుడెప్పుడో రామ్ చరణ్ తుఫానులో నటించిన తర్వాత మళ్ళీ తను టాలీవుడ్ స్టార్లతో జత కట్టలేదు. మనకు

వారణాసి ట్విస్టుకి జక్కన్న రియాక్షన్ ఏంటోవారణాసి ట్విస్టుకి జక్కన్న రియాక్షన్ ఏంటో

నవంబర్ 15 రివీల్ కాబోతున్న ఎస్ఎస్ఎంబి టైటిల్ ఏంటనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. లీకైన సోర్స్ నుంచి వినిపిస్తున్న పేరు వారణాసి. కానీ ఇంత పెద్ద గ్లోబల్ మూవీకి అలా పెడతారానే అనుమానం అభిమానుల్లో లేకపోలేదు. ఆర్ఆర్ఆర్ టైంలో కూడా