hyderabadupdates.com Gallery రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్ వెరీ స్పెష‌ల్

రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్ వెరీ స్పెష‌ల్

రామ్ చరణ్  డ్రెస్సింగ్ స్టైల్ వెరీ స్పెష‌ల్ post thumbnail image

హైద‌రాబాద్ : మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ మూవీ నిర్మాత‌, చిరంజీవి ముద్దుల కూతురు సుస్మిత కొణిద‌ల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. త‌న సోద‌రుడు, ప్ర‌ముఖ న‌టుడు రామ్ చ‌ర‌ణ్ డ్రెస్సింగ్ గురించి స్పందించింది. రామ్ చరణ్ ఫిట్, సౌకర్యం, హుందాతనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తార‌ని తెలిపారు. అదే ప‌నిగా ఫ్యాషన్ ట్రెండ్‌లను గుడ్డిగా అనుసరించే వ్యక్తి కాదని పేర్కొంది. ఆర్ ఆర్ఆర్ మూవీ హీరో త‌న వ్య‌క్తిగ‌త శైలి గురించి చాలా స్ప‌ష్టంగా ఉంటార‌ని , ప్రస్తుతం ఫ్యాషన్‌లో ఉన్న వాటి కంటే తన శరీర ఆకృతికి సరిపోయే దుస్తులనే ఇష్టపడతారని ఆమె పంచుకున్నారు. సుస్మిత కొణిద‌ల ప్రకారం రామ్ చరణ్ ఫిట్, సౌకర్యం, హుందాతనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారని స్పష్టం చేసింది.
తాను ధరించే దుస్తుల విషయంలో చాలా ప్రత్యేకంగా ఉంటారని తెలిపింది సుష్మిత కొణిద‌ల‌. తనకు బాగా సరిపోయే దుస్తులను ఎంచుకోవడానికి సమయం తీసుకుంటారని పేర్కొంది. తెరపై అయినా, తెర వెనుక అయినా, అతని సహజమైన హుందాతనం, ఆత్మ విశ్వాసం ఏ దుస్తులనైనా సులభంగా ధరించడానికి వీలు కల్పిస్తాయని తెలిపింది. ఇదిలా ఉండ‌గా మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ మూవీతో తొలిసారిగా నిర్మాత‌గా మారారు. ఇందులో త‌న తండ్రి ప్ర‌ముఖ న‌టుడు చిరంజీవిని హీరోగా పెట్టి తీసింది. ఇది ఊహించ‌ని రీతిలో ఏకంగా వారం రోజుల్లోనే రూ. 300 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. రికార్డుల మోత మోగించింది. ఈ మూవీలో చిరంజీవి ధ‌రించిన దుస్తులు సైతం ఆక‌ట్టుకునేలా ఉన్నాయి.
The post రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్ వెరీ స్పెష‌ల్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Prashant Kishor: రాహుల్‌ గాంధీ లాగే తేజస్వీ కూడా ఓడిపోతారు – ప్రశాంత్‌ కిశోర్‌Prashant Kishor: రాహుల్‌ గాంధీ లాగే తేజస్వీ కూడా ఓడిపోతారు – ప్రశాంత్‌ కిశోర్‌

Prashant Kishor : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిహార్‌లో ప్రచారం జోరందుకుంటోంది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ సొంత నియోజకవర్గమైన రాఘోపుర్‌ నుంచి జన్‌సురాజ్‌ పార్టీ తన ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే తేజస్వీ యాదవ్ పై ఆ పార్టీ

Digital Arrest: టీడీపీ ఎమ్మెల్యే ‘డిజిటల్‌ అరెస్టు’ కేసులో ఎనిమిది మంది అరెస్టుDigital Arrest: టీడీపీ ఎమ్మెల్యే ‘డిజిటల్‌ అరెస్టు’ కేసులో ఎనిమిది మంది అరెస్టు

    ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ కడప జిల్లా మైదుకూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను సైబర్‌ నేరగాళ్లు ‘డిజిటల్‌ అరెస్టు’చేసి, ఆయన నుంచి రూ.1.07 కోట్లు కాజేసిన కేసు కొలిక్కి వచ్చింది. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మొత్తం

YS Jagan: అక్రమాస్తుల కేసులో మెమో దాఖలు చేసిన మాజీ సీఎం జగన్YS Jagan: అక్రమాస్తుల కేసులో మెమో దాఖలు చేసిన మాజీ సీఎం జగన్

    ఆంధ్ర‌ప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన అక్రమాస్తుల కేసుకు సంబంధించి మాజీ సీఎం జగన్ మరో నిర్ణయం తీసుకున్నారు. అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. యూరప్ పర్యటన తర్వాత ఈనెల 14 లోపు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని