hyderabadupdates.com Gallery రాష్ట్రంలో నూత‌న క్రీడా పాల‌సీ అమ‌లు చేస్తాం

రాష్ట్రంలో నూత‌న క్రీడా పాల‌సీ అమ‌లు చేస్తాం

రాష్ట్రంలో నూత‌న క్రీడా పాల‌సీ అమ‌లు చేస్తాం post thumbnail image

హైద‌రాబాద్ : క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. 2026-2027 బడ్జెట్ లో క్రీడాకారులకు ఆర్థిక సహాయం, ఇతర వసతులపై డా. బి. ఆర్. అంబేద్కర్ సచివాలయంలో మంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన క్రీడా పాలసీ తీసుకు వచ్చి, క్రీడలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా మంత్రి అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను ఆటల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా క్రీడా శాఖకు 2026-2026 బడ్జెట్ లో అధిక నిధుల కేటాయింపుతో పాటు, క్రీడాకారులకు ఆర్థిక సహాయంపై అధికారులతో చర్చించారు. ఒలంపిక్, పారా ఒలంపిక్, అంతర్జాతీయ, జాతీయ ఆటల పోటీల్లో పతకాలు సాధించిన వారికి ఆర్థిక సహాయం అందించేలా బడ్జెట్ లో కేటాయింపులు ఉండేలా ప్రతిపాదనలు పంపాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
పాఠశాల విద్య నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఆటల్లో ప్రతిభ కనబరుస్తున్న వారికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందచేస్తుందని మంత్రి చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సహంతోనే విద్యార్థులు, యువకులు క్రీడల్లో రాణిస్తారని మంత్రి స్ప‌ష్టం చేశారు. క్రీడాకారులకు ఇచ్చే పారితోషికాలపై విధి విధానాలు రూపొందించాలని, వాటిని నిష్పక్షపాతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ MD సోనీ బాలాదేవి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
The post రాష్ట్రంలో నూత‌న క్రీడా పాల‌సీ అమ‌లు చేస్తాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

YS Jagan: సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ లేఖYS Jagan: సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ లేఖ

    కృష్ణా జలాల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్… ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాసారు. ట్రిబ్యునల్ లో రాష్ట్ర ప్రభుత్వం తరపున గట్టిగా వాదనలు వినిపించి… ఏపీకు

కిమ్ వారసురాలిగా కిమ్ కూతురుకిమ్ వారసురాలిగా కిమ్ కూతురు

ఉత్త‌ర కొరియా : ఉత్త‌ర కొరియాలో ఏం జ‌రుగుతోంద‌నే చ‌ర్చ కొన‌సాగుతోంది. ప్రస్తుతం ఆ దేశానికి కిమ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. త‌న త‌దుప‌రి పాల‌కురాలిగా త‌న కూతురుగా కిమ్ జు ఏ కానుందా. అవున‌నే జ‌నం అంటున్నారు. దక్షిణ కొరియా

నిబంధనల ఉల్లంఘనలే ప్రమాదానికి కారణంనిబంధనల ఉల్లంఘనలే ప్రమాదానికి కారణం

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. యాజమాన్యాలు భద్రతాపరమైన నిబంధనలు పాటించక పోవడమే వేట్లపాలెం బాణసంచా తయారీ యూనిట్లోపేలుడు ప్రమాదానికి కారణమని చెప్పారు. జాతరలు, పండుగలు ఉండడంతో పరిమితికి మించి కూలీలను పనికి పెట్టుకున్నారని