hyderabadupdates.com Gallery రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జిల నిర్మాణం చేప‌ట్టాలి : డీకే అరుణ‌

రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జిల నిర్మాణం చేప‌ట్టాలి : డీకే అరుణ‌

రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జిల నిర్మాణం చేప‌ట్టాలి :  డీకే అరుణ‌ post thumbnail image

హైద‌రాబాద్ : మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం స‌భ్యురాలు డీకే అరుణ భ‌ర‌త సింహా రెడ్డి మ‌ర్యాద పూర్వ‌కంగా సికింద్రాబాద్ లోని రైల్ నిల‌యంలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో భేటీ అయ్యారు. ఈసంద‌ర్బంగా త‌న నియోజ‌క‌వ‌ర్గంతో పాటు రాష్ట్రంలోని త‌ర ప్రాంతాల‌లో రైల్వే శాఖా ప‌రంగా ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు ప్ర‌త్యేకంగా.
మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని పలు ప్రాంతాలలో రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జీఎం దృష్టికి తీసుకు వెళ్లారు ఎంపీ అరుణ‌. వీటిని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాల్లో రోడ్డు అండర్ బ్రిడ్జి (RUB), రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ROB)లతో పాటు లిమిటెడ్ హైట్ సబ్ వే (LHS)ల నిర్మాణం కొరకు గతంలో ప‌లు విన‌తి ప‌త్రాలు అంద‌జేశామ‌న్నారు డీకే అరుణ‌. వినతిపత్రాలకు సంబంధించిన పురోగతి పై రైల్వే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన‌ట్లు తెలిపారు.
తిమ్మసానిపల్లి, బోయపల్లి, వీరన్నపేటలోని రైల్వే ట్రాక్ లపై రోడ్డు ఓవర్ బ్రిడ్జి, మోతి నగర్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలకు సంబంధించి ఫిజబులిటీ రిపోర్ట్ పూర్తయిందని, రైల్వే బోర్డుకు ప్రతిపాదన పంపడం జరిగిందని అన్నారు. మార్చ్, ఏప్రిల్ లో ఆ పనులు కూడా సాంక్షన్ అవనున్నట్లు రైల్వే జనరల్ మేనేజర్ ఈసంద‌ర‌ర్బంగా ఎంపీ డీకే అరుణ‌కు తెలిపారు. అలాగే దేవరకద్రలో లిమిటెడ్ హైట్ సబ్ వే (LHS) సాంక్షన్ అయ్యిందని, ఫిబ్రవరి చివరి వారంలో టెండర్లను పిలవనున్న‌ట్లు చెప్పారు శ్రీ‌వాత్స‌వ‌. TD గుట్టలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ROB) కూడా శాంక్షన్ అయ్యిందని, నిర్మాణ పనులకు ఏప్రిల్ లో టెండర్లను ఆహ్వానించనున్నట్లు తెలిపారు.
The post రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జిల నిర్మాణం చేప‌ట్టాలి : డీకే అరుణ‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

భారత్ సుంకాలపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్భారత్ సుంకాలపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్

అమెరికా : దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి భార‌త దేశంపై నోరు పారేసుకున్నారు. ఇండియా త‌మ‌కు సుంకాలు చెల్లిస్తుంద‌ని, కానీ తాము వారికి ఎట్టి ప‌రిస్థితుల్లో చెల్లించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. శ‌నివారం ట్రంప్ మీడియాతో

Kinjarapu Rammohan Naidu: నవంబర్‌ 15 నుంచి విజయవాడ- సింగపూర్‌ మధ్య ఇండిగో విమాన సర్వీసుKinjarapu Rammohan Naidu: నవంబర్‌ 15 నుంచి విజయవాడ- సింగపూర్‌ మధ్య ఇండిగో విమాన సర్వీసు

Kinjarapu Rammohan Naidu : విజయవాడ- సింగపూర్‌ మధ్య ఇండిగో నూతన విమాన సర్వీసును ప్రారంభించనున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు (Kinjarapu Rammohan Naidu) తెలిపారు. విజయవాడ నుంచి మంగళ, గురు, శనివారాల్లో ఈ సర్వీసు ఉంటుందని

Bengaluru: బెంగుళూరు ఏటీఎం క్యాష్ వెహికల్ దోపిడీ కేసును చేధించిన పోలీసులుBengaluru: బెంగుళూరు ఏటీఎం క్యాష్ వెహికల్ దోపిడీ కేసును చేధించిన పోలీసులు

  బెంగళూరు ఏటీఎం వ్యాన్‌ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఏపీలోని కుప్పంలో తనిఖీలు నిర్వహించిన కర్ణాటక పోలీసులు… కూర్మానీపల్లెలో రూ. 7.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. నవీన్‌ అనే యువకుడి ఇంట్లో నగదు పట్టుకున్నారు. గత రెండు రోజులుగా