hyderabadupdates.com Gallery వంట గ్యాస్ కు కొర‌త లేకుండా చూడాలి : సీఎం

వంట గ్యాస్ కు కొర‌త లేకుండా చూడాలి : సీఎం

వంట గ్యాస్ కు కొర‌త లేకుండా చూడాలి : సీఎం post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌స్తుతం ప‌శ్చిమ ఆసియా లో యుద్దం కొన‌సాగుతోంద‌ని, దీంతో గ్యాస్, ఆయిల్ కొర‌త ఏర్ప‌డింద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని, దీనిపై ఆరా తీశారు సీఎం. ఈ మేర‌కు కీల‌క స‌మీక్ష చేప‌ట్టారు. రాష్ట్రంలో ఏ ఒక్క‌రూ గ్యాస్ కోసం ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌ధానంగా దీపం పథకం లబ్దిదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ)కి మారినా కూడా వారికి ఇచ్చే రాయితీ సొమ్మును వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఈ మేరకు సత్వరమే ఉత్తర్వులను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
గల్ఫ్ లో జరుగుతున్న యుద్ధం నేపధ్యంలో రాష్ట్రంలో వంట గ్యాస్ సరఫరాపై సచివాలయంలో నేడు సమీక్ష నిర్వహించారు. రాబోయే 6 నెలల్లో మొత్తం 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. శ్రీకాకుళం – కాకినాడ నేచురల్ గ్యాస్ పైప్ లైన్ పనుల్లో జాప్యంపై సీఎం అధికారుల వివరణ కోరారు. దీనికి సంబంధించి కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని అధికారులు చెప్పడంతో సమీక్షా సమావేశం నుంచే కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ఫోన్ చేశారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి అయినందున వెంటనే పనులు పూర్తి చేసేలా చూడాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే సమీక్షించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
The post వంట గ్యాస్ కు కొర‌త లేకుండా చూడాలి : సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఐజేయూ అధ్యక్షునిగా బల్విందర్ జమ్మూఐజేయూ అధ్యక్షునిగా బల్విందర్ జమ్మూ

విజ‌య‌వాడ : ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ 11 వ ప్లీనరీ ముగింపు సందర్భంగా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. ఐ.జే.యు. అధ్యక్షునిగా బల్విందర్ సింగ్ జమ్మూ (పంజాబ్) , సెక్రటరీ జనరల్ గా డి.సోమసుందర్ (ఆంధ్రప్రదేశ్) గతంలోనే ఏకగ్రీవంగా ఎన్నిక

PM Narendra Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ప్రారంభించిన మోదీPM Narendra Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ప్రారంభించిన మోదీ

    నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్-1 ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. అదానీ ఎయిర్‌పోర్ట్స్, సిడ్కో మధ్య పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో రూ.19,650 కోట్లతో దీనిని నిర్మించారు. దీని వార్షిక ప్రయాణికుల సామర్థ్యం 9 కోట్లు.

ఆరంభం అదిరింది ఆర్సీబీ గెలిచిందిఆరంభం అదిరింది ఆర్సీబీ గెలిచింది

బెంగ‌ళూరు : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ -2026 సీజ‌న్ అట్ట‌హాసంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో ప్రారంభ‌మైంది. ముందుగా బ్యాటిగ్ చేసింది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 201 ర‌న్స్ చేసింది. అనంత‌రం మైదానంలోకి దిగిన