hyderabadupdates.com Gallery వరుణ్‌ తేజ్‌ కొత్త ప్రాజెక్టు!

వరుణ్‌ తేజ్‌ కొత్త ప్రాజెక్టు!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ కెరీర్‌లో ఇటీవల వచ్చిన వరుస వైఫల్యాలు ఆయనకు కొంత వెనుకడుగు అయ్యాయి. దీంతో ప్రస్తుతం ఆయన పూర్తిగా కొత్త జోష్‌తో తిరిగి పుంజుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం వరుణ్ “కొరియన్ కనకరాజు” అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో కొనసాగుతోంది. సమాచారం ప్రకారం నవంబర్ చివరినాటికి అన్ని షెడ్యూల్స్ పూర్తి చేసి, తదుపరి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు.

ఇదిలా ఉండగా, వరుణ్ తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ టాక్. విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించే ఈ లవ్ స్టోరీ గతేడాదే ఫైనల్ అయినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ప్రారంభం ఆలస్యమైంది. కానీ ఇప్పుడు పరిస్థితులు క్లియర్ కావడంతో, వరుణ్ తేజ్ డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు తన డేట్స్‌ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని ముఖ్యమైన షెడ్యూల్ అమెరికాలో ప్లాన్ చేసినట్టు తెలిసింది.
The post వరుణ్‌ తేజ్‌ కొత్త ప్రాజెక్టు! appeared first on Telugumopo – Movies and Politics.

Related Post

Brazilian Woman: రాహుల్ ‘హైడ్రోజన్‌ బాంబు’ పై స్పందించిన బ్రెజిల్‌ మోడల్Brazilian Woman: రాహుల్ ‘హైడ్రోజన్‌ బాంబు’ పై స్పందించిన బ్రెజిల్‌ మోడల్

    హరియాణా ఎన్నికల్లో బీజేపీ ఓట్‌ చోరీపై ‘హైడ్రోజన్‌ బాంబు’ పేల్చే క్రమంలో.. రాహుల్‌ గాంధీ ప్రస్తావించిన మోడల్‌ ఎవరో తెలిసిపోయింది. ఆమె బ్రెజిలియనే. కానీ మోడల్‌ కాదు. పేరు లారిస్సా నెరీ. తన స్నేహితుడైన ఫొటోగ్రాఫర్‌ మాథ్యూస్‌ ఫెర్రెరో

CM Chandrababu: లండన్ లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశంCM Chandrababu: లండన్ లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం

  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ వివిధ పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు సోమవారం లండన్ లో భేటీ అయ్యారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి లండన్ వెళ్లినా… రాష్ట్రంలో పెట్టుబడులు, విశాఖలో ఈ నెల 14,15 తేదీల్లో జరగనున్న

Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది – పవన్Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది – పవన్

    గత టీటీడీ బోర్డు పరిపాలనా వైఫల్యం, అనైతిక చర్యలు తిరుమల పవిత్రతను దెబ్బ తీశాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆ నమ్మక ద్రోహం ప్రస్తుత టీటీడీ బోర్డుకు ఒక లోతైన పాఠంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.