hyderabadupdates.com movies వావ్… కాంతార ఖాతాలో 700 కోట్లు

వావ్… కాంతార ఖాతాలో 700 కోట్లు

అంచనాలకు మించి ఆడేసిన కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ తాజాగా ఏడు వందల కోట్ల క్లబ్బులో అడుగుపెట్టినట్టు ట్రేడ్ రిపోర్ట్. నెట్ లెక్కల్లో చూసుకుంటే సుమారు అయిదు వందల కోట్ల దాకా తేలుతుంది. ఇప్పటిదాకా ఇంత మొత్తాన్ని సాధించిన పదిహేనవ ఇండియన్ మూవీగా కొత్త రికార్డు నమోదు చేసుకుంది. ఏపీ తెలంగాణలో బాగా నెమ్మదించినప్పటికీ కాంతార చాప్టర్ 1 ఇప్పటికీ కర్ణాటకలో స్ట్రాంగ్ గా ఉంది. మూడో వారం పూర్తి చేసుకోబోతున్నా అక్కడ హౌస్ ఫుల్స్ నమోదవుతూనే ఉన్నాయి. బుక్ మై షోలో ట్రెండింగ్ కి అదే ప్రధాన కారణంగా నిలుస్తోంది. హిందీలోనూ మంచి గ్రిప్ అందుకున్న కాంతార అక్కడ వంద కోట్లు దాటేసింది.

ఇప్పుడప్పుడే కాంతార ఫైనల్ రన్ కు రాకపోవచ్చు. తెలుగు, తమిళంలో కొత్త సినిమాలు వచ్చాయి కానీ కన్నడలో దీన్ని దాటుకునే స్థాయిలో ఏ రిలీజు జరగలేదు. అందుకే అక్కడ వసూళ్ల సునామి కొనసాగుతోంది. అయితే వెయ్యి కోట్ల కలను నెరవేర్చుకుంటుందని భావించిన అభిమానులు నిరాశ పడక తప్పేలా లేదు. ఎందుకంటే ఇంకో మూడు వందల కోట్లు రావాలంటే కాంతార చాప్టర్ 1 అద్భుతాలు చేయాలి. మళ్ళీ పికప్ కావాలి. కానీ డ్యూడ్, కె ర్యాంప్ లు డీసెంట్ నుంచి పాజిటివ్ మధ్యలో రిపోర్ట్స్ తెచ్చుకోవడంతో మూవీ లవర్స్ వాటి వైపు షిఫ్ట్ అయిపోయారు. ఇది బాగా ప్రభావితం చేసే అంశం.

కాకపోతే కూలీ కన్నా చాలా మెరుగ్గా కాంతార ఆడటం విశేషం, రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి దిగ్గజాలు అందరూ కలిసి నటించినా కాంతార చాప్టర్ 1 సాధించిన వసూళ్లకు దగ్గరగా కూడా వెళ్లలేకపోయారు. అలాంటిది ఒక పల్లెటూరి గ్రామీణ సాంప్రదాయాన్ని గొప్పగా ఆవిష్కరించిన రిషబ్ శెట్టి అంత సులభంగా అందుకోలేని గొప్ప ఫలితం సాధించాడు. ఆదివారంతో కలిపి పండగ హడావిడి మూడు రోజులు ఉంటుంది కాబట్టి కాంతార మళ్ళీ పికప్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే హోంబాలే ఫిలిమ్స్ తెలివిగా కొత్త కొత్త ట్రైలర్లు కట్ చేసి ముఖ్యంగా పిల్లలను ఆకర్షించే పనిలో ఉంది.

Related Post

క‌మ్యూనిస్టు కోటలో కాంగ్రెస్ పాగా వేసిన‌… దామన్న క‌న్నుమూత‌క‌మ్యూనిస్టు కోటలో కాంగ్రెస్ పాగా వేసిన‌… దామన్న క‌న్నుమూత‌

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి, సూర్యాపేట నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ ఇంచార్జ్‌.. రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి ఉర‌ఫ్ దామన్న‌ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 73 సంవ‌త్స‌రాలు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముఖ్య‌మంత్రులుగా ప‌నిచేసిన‌ నేదురుమ‌ల్లి జ‌నార్ద‌న్ రెడ్డి, వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మంత్రి

18 ల‌క్ష‌లు- 12 ఎక‌రాలు: ఆ కుటుంబానికి చంద్ర‌బాబు సాయం!18 ల‌క్ష‌లు- 12 ఎక‌రాలు: ఆ కుటుంబానికి చంద్ర‌బాబు సాయం!

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలోని కందుకూరు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న దార‌గానిపాడు గ్రామంలో జ‌రిగిన దారుణ హ‌త్య పై సీఎం చంద్ర‌బాబు ఉదారంగా స్పందించారు. ఈ నెల 2న జ‌రిగిన ఘ‌ట‌న‌లో ల‌క్ష్మీనాయుడు అనే వ్య‌క్తిని టీడీపీకి చెందిన హ‌రిశ్చంద్ర‌ప్ర‌సాద్ అనే వ్య‌క్తి