hyderabadupdates.com movies వాహ్… రైతులకోసం బురదను సైతం లెక్క చెయ్యని పవన్

వాహ్… రైతులకోసం బురదను సైతం లెక్క చెయ్యని పవన్

వాహ్… రైతులకోసం బురదను సైతం లెక్క చెయ్యని పవన్ post thumbnail image

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పొలంబాట ప‌ట్టారు. తుఫాను ప్ర‌భావంతో భారీగా కురిసిన వ‌ర్షాల‌కు దెబ్బ‌తిన్న పొలాల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో గురువారం ప‌ర్య‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని రైతుల‌ను ప‌రామ‌ర్శించారు. కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలో నేలకొరిగిన వరి పైరు పరిశీలించారు. బుర‌ద‌లోనే న‌డుస్తూ.. పొలం మ‌ధ్య‌కు వెళ్లి ప‌రిశీలించారు.

రైతుల స‌మ‌స్య‌ల‌ను ఓపిక‌గా విన్నారు. వారికి భ‌రోసా క‌ల్పించారు. ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని తెలిపారు. తుఫాను ప్ర‌భావంతో ప్రాణ న‌ష్టం క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నామ‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పంట‌లు, ఇళ్ల‌కు న‌ష్టం క‌లిగింద‌ని.. దీని నుంచి రైతుల‌ను కాపాడే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. అనంత‌రం అవనిగడ్డ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద తుఫాన్ ప్రభావ దృశ్యాలతో కూడిన ఫోటో ఎక్సిబిషన్ పరిశీలించారు. జ‌రిగిన న‌ష్టాన్ని క‌లెక్ట‌ర్ బాలాజీ ని అడిగి తెలుసుకున్నారు.

సీఎం చంద్ర‌బాబు స‌హా మంత్రులు అంద‌రూ నిరంత‌రం తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల్లోని ప‌రిస్థితిని అంచనా వేశార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. అందుకే.. ప్రాణ న‌ష్టం ముప్పు నుంచి తేరుకున్నామ‌న్నారు. అయితే.. పంట‌లు, ఇళ్లు కూడా దెబ్బ‌తిన్నాయ‌ని ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని హామీ ఇచ్చారు. అయితే.. ప్ర‌స్తుతం ఎన్యూమ‌రేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వుతుంద‌ని.. న‌ష్టాల‌ను అంచ‌నా వేసుకుని.. ప్ర‌భుత్వం ప్ర‌తి ఒక్క‌రికీ న్యాయం చేస్తుంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు.

Related Post

టాలీవుడ్ స్టార్లు నిజంగా గోల్డుటాలీవుడ్ స్టార్లు నిజంగా గోల్డు

బయట చాలా మంది జనాల్లో ఒక అపోహ ఉంది. స్టార్ హీరోలు పదులు, వందల కోట్ల రెమ్యునరేషన్లతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని, డబ్బే ప్రపంచంగా ఉంటారని, దాన్ని వసూలు చేసుకోవడం కోసం నిర్మాతను పీడిస్తారనే అభిప్రాయం చాలాసార్లు సోషల్ మీడియాలో చూశాం.

Avengers: Doomsday to Spider-Man: Brand New Day — 5 Hollywood films to watch out for in 2026Avengers: Doomsday to Spider-Man: Brand New Day — 5 Hollywood films to watch out for in 2026

Hollywood’s 2026 slate is shaping up to be a massive treat for moviegoers, with several big-budget spectacles and franchise favorites lined up. From superhero epics to ambitious sci-fi adaptations, these

అమరావతికి 100 కోట్ల విరాళం.. ఎందుకంటే!అమరావతికి 100 కోట్ల విరాళం.. ఎందుకంటే!

న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తికి భారీ విరాళం ల‌భించింది. 100 కోట్ల రూపాయ‌ల విరాళం ఇవ్వ‌నున్న‌ట్టు దుబాయ్ కు చెందిన శోభా గ్రూప్ సంస్థ‌ చైర్మన్ పీఎన్సీ మీనన్ తెలిపారు. ఈ నిధుల‌తో ప్ర‌పంచ స్థాయి గ్రంథాల‌యాన్ని నిర్మించాల‌ని మీన‌న్ సూచించారు. ప్ర‌స్తుతం