hyderabadupdates.com Gallery విజ‌య్ ర‌ష్మిక జంట‌కు పీఎం అభినంద‌న‌ లేఖ‌

విజ‌య్ ర‌ష్మిక జంట‌కు పీఎం అభినంద‌న‌ లేఖ‌

విజ‌య్ ర‌ష్మిక జంట‌కు పీఎం అభినంద‌న‌ లేఖ‌ post thumbnail image

న్యూఢిల్లీ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నాలు ఇటీవ‌లే ఒక్క‌ట‌య్యారు. స్వంతంగా గృహ ప్ర‌వేశం కూడా చేశారు. పెళ్లికి ముందు ఈ ఇద్ద‌రూ వ్య‌క్తిగ‌తంగా ఢిల్లీలోని ప్ర‌ధాని కార్యాల‌యంలో న‌రేంద్ర మోదీని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. త‌మ పెళ్లికి, రిసెప్ష‌న్ కు రావాలంటూ కోరారు. వారిని ప్ర‌త్యేకంగా అభినందించారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాను షేక్ చేశాయి. ఇదిలా ఉండ‌గా త‌న‌ను క‌లిసినందుకు సంతోషంగా ఉంద‌ని పేర్కొన్నారు మోదీ. బుధ‌వారం ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నాల‌ను అభినందిస్తూ శుభాకాంక్ష‌లు తెలియ చేస్తూ లేఖ పంపించారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా పీఎంఓ స్ప‌ష్టం చేసింది.
విజయ్ దేవరకొండ కుటుంబానికి అధికారిక ప్రశంసా లేఖను పంపింది. ఈ సంజ్ఞ నటుడి బృందం, కుటుంబ సభ్యులను ఆనంద పరిచింది. దేవరకొండ నివాసానికి అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా లేఖ కాపీని కూడా పంపింది. ఈ లేఖ ఇవాళ హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లోని కుటుంబం ఉంటున్న‌ ఇంటికి చేరింది. అరుదైన గుర్తింపుపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నటుడి పీఆర్ బృందం ఆన్‌లైన్‌లో నవీకరణను పంచుకుంది. ప్రధానమంత్రి కార్యాలయం నుండి అధికారిక సమాచారం అందుకోవడం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించ బడుతుంది, ఫిబ్రవరి 26న జరిగిన ఈ ప్రముఖ జంట వివాహం మరింత చిరస్మరణీయంగా ఉంటుంది. ఈ సంద‌ర్బంగా త‌మ‌కు ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు తెలియ చేసినందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు విజయ్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా.
The post విజ‌య్ ర‌ష్మిక జంట‌కు పీఎం అభినంద‌న‌ లేఖ‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Sabarimala: అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిపోయిన శబరిమలSabarimala: అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిపోయిన శబరిమల

    కేరళలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్నటి నుంచే(సోమవారం) దర్శనాలు ప్రారంభం కావడంతో వేలాదిగా భక్తలు తరలివస్తున్నారు. కిలోమీటర్ల వరకు క్యూ లైన్ ఉండటంతో దర్శనానికి పదిహేను గంటల సమయం పడుతోంది. అయితే సరైన

భార‌త దేశానికి గ‌ర్వ కార‌ణం సంజు శాంస‌న్భార‌త దేశానికి గ‌ర్వ కార‌ణం సంజు శాంస‌న్

కేర‌ళ : ప్ర‌ముఖ మ‌ల‌యాళీ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా నిలిచిన భార‌త జ‌ట్టును అభినందించారు. ఇదే స‌మ‌యంలో త‌మ కేర‌ళ రాష్ట్రానికి చెందిన స్టార్ క్రికెట‌ర్

ఉమెన్ వెల్‌నెస్ ప్రొఫైలింగ్ పై ఫోక‌స్ పెట్టాలిఉమెన్ వెల్‌నెస్ ప్రొఫైలింగ్ పై ఫోక‌స్ పెట్టాలి

హైద‌రాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉమెన్ వెల్‌నెస్ ప్రొఫైలింగ్ ప్రోగ్రామ్ అమలులో అలసత్వం వహించ వద్దని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్