hyderabadupdates.com movies శ్రీలీల & కృతిశెట్టి…. ఇద్దరికీ షాకే

శ్రీలీల & కృతిశెట్టి…. ఇద్దరికీ షాకే

టాలీవుడ్ హీరోయిన్లు శ్రీలీల, కృతి శెట్టి ఇద్దరికీ ఒకేసారి కోలీవుడ్ షాకులు తగిలాయి. పొంగల్ పండగ సందర్భంగా విడుదలైన వీళ్ళ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అనిపించుకోవడంతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.

ముందు శ్రీలీల సంగతి చూస్తే పరాశక్తి మీద తను పెట్టుకున్న ఆశలు అన్నిఇన్ని కావు. 1960 బ్యాక్ డ్రాప్, అందులోనూ సుధా కొంగర లాంటి కల్ట్ డైరెక్టర్, హీరో శివ కార్తికేయన్ ఇంతకన్నా సెటప్ ఏం కావాలి. ఒకప్పుడు తమిళనాడుని ఊపేసిన హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని కాన్సెప్ట్ గా తీసుకున్న దర్శకురాలు దాన్ని అన్ని వర్గాలను మెప్పించేలా తీయకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది.

నటన పరంగా శ్రీలీల గ్లామర్ షో, డాన్సులు లేకుండా సిన్సియర్ గా చేసినప్పటికీ కంటెంట్ జనాలకు రీచ్ కాకపోవడంతో నిరాశ తప్పలేదు. అమరన్ సూపర్ హిట్ తర్వాత శివ కార్తికేయన్ కిది రెండో ఫ్లాప్.

ఇక కృతి శెట్టి విషయానికి వస్తే కార్తీతో జట్టు కట్టిన వా వతియార్ (అన్నగారు వస్తారు) అంచనాల్లో కనీసం సగం కూడా అందుకోలేక ఫైట్ చేస్తోంది. ఎంజిఆర్ రిఫరెన్స్ తో కొత్తగా ట్రై చేసిన దర్శకుడు నలన్ కుమారస్వామి కేవలం అభిమానులను మెప్పించడానికే ఆపసోపాలు పడ్డాడు. హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి పెర్ఫార్మన్స్ కి పెద్దగా స్కోప్ దక్కపోవడంతో ప్రేక్షకులు తన గురించి మాట్లాడుకునే ఛాన్స్ దొరకలేదు.

మొత్తానికి ఇద్దరికీ స్వీట్ షాక్ అయితే కొట్టింది. విచిత్రంగా తమిళ హీరోయిన్ నయనతార తెలుగుకు వచ్చి మన శంకరవరప్రసాద్ గారితో బ్లాక్ బస్టర్ కొడితే మనోళ్లు అక్కడికి వెళ్లి డిజాస్టర్లు చూశారు. ఇండస్ట్రీ విచిత్రాలు ఇలాగే ఉంటాయి.

శ్రీలీల, కృతి ఇద్దరికీ ఇవి తమిళ డెబ్యూలు కావడం గమనార్హం. కృతి మరో రెండు సినిమాలు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, జీనీలు సైతం ఏవేవో కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూనే ఉన్నాయి. అప్పుడైనా సక్సెస్ దక్కుతుందేమో చూడాలి. ఇక శ్రీలీల కార్తీక్ ఆర్యన్ తో చేసిన తొలి హిందీ సినిమా, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ ఏడాదే థియేటర్లలో అడుగు పెట్టబోతున్నాయి.

Related Post

జగన్ – కేటీఆర్: ఇద్దరు ఒకే వేదికపై…జగన్ – కేటీఆర్: ఇద్దరు ఒకే వేదికపై…

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బెంగళూరులో ఒకే వేదికపై కలుసుకోవడం తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు. కేటీఆర్, జగన్ ఇద్దరూ