hyderabadupdates.com Gallery శ్రీవాణి ఆన్ లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో మార్పులు

శ్రీవాణి ఆన్ లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో మార్పులు

శ్రీవాణి ఆన్ లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో మార్పులు post thumbnail image

తిరుమల: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ( టీటీడీ) శ్రీవాణి ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో కీల‌క మార్పులు చేసింది. గతంలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించింది. ఈ నుంచి భక్తులు శ్రీవాణి ట్రస్ట్ కు రూ.10వేలు విరాళంతోపాటు, వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్ కు కూడా రూ.500 కలిపి ఒకేసారి రూ.10,500 చెల్లించే అవకాశం కల్పించారు. దీనికి సంబంధించిన పేమెంట్ గేట్ వే లావాదేవీలను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పగించారు. ఇందుకోసం భక్తులు యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ లో చెల్లింపులు చేసేలా నిర్ణ‌యం తీసుకుంది టీటీడీ.
ఇక శ్రీ‌వాణి టికెట్ల విష‌యానిక వ‌స్తే కరెంట్ బుకింగ్ కోటా కింద ప్రతిరోజూ 800 టికెట్లను ఏరోజుకారోజు ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ వేదిక‌గా టికెట్లు విడుద‌ల చేస్తారు. ఈ విధానంలో 1+3 భక్తులకు మాత్రమే టికెట్ బుకింగ్ అనుమతి ఇస్తున్నారు. ఒక ఐడీపై ఒకసారి టికెట్ పొందితే వారం రోజుల పాటు టికెట్ పొందడానికి వీలుపడ‌ద‌ని, ఈ విష‌యాన్ని భ‌క్తులు గ‌మ‌నించాల‌ని స్ప‌ష్టం చేసింది టీటీడీ.
ఇప్పటి వరకు భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10000 విరాళం ఇచ్చి, ఇతర వివరాలు నమోదు చేసి రూ.500 చెల్లించేలోపు టిక్కెట్లు అయిపోయినట్లు ఫిర్యాదులు అందేవి. అప్పటికే శ్రీవాణి ట్రస్ట్ కు రూ.10వేలు విరాళం ఇచ్చిన భక్తులు రూ.500 చెల్లించి టికెట్లను కొనుగోలు చేసేవారు. దీంతో కరెంట్ బుకింగ్ లో ట్రస్టుకు సంబంధించి విరాళం అందించినవారు ఇబ్బంది ఏర్పడినట్లు ఫిర్యాదులు అందాయి. వీటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న టీటీడీ పాల‌క మండ‌లి కీల‌క మార్పులు చేసింది.
The post శ్రీవాణి ఆన్ లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో మార్పులు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

తెలంగాణ ఆర్థిక కార్య‌ద‌ర్శిపై హైకోర్టు సీరియ‌స్తెలంగాణ ఆర్థిక కార్య‌ద‌ర్శిపై హైకోర్టు సీరియ‌స్

హైద‌రాబాద్ : తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆరు నూరైనా స‌రే రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఈరోజు కోర్టుకి హాజరు కావాల్సిందేనని ఆదేశించారు పైకోర్టు జడ్జీ రాజేశ్వర రావు. వందలాది మంది తెలంగాణ విశ్రాంత ప్రభుత ఉద్యోగులు తమ

చంద్ర‌హాస్ బూతు పాటపై జేడీ చ‌క్ర‌వ‌ర్తి క‌న్నెర్ర‌చంద్ర‌హాస్ బూతు పాటపై జేడీ చ‌క్ర‌వ‌ర్తి క‌న్నెర్ర‌

హైద‌రాబాద్ : బ‌రా బ‌ర్ ప్రేమిస్తా మూవీ సంద‌ర్బంగా నిర్వ‌హించిన ఈవెంట్ లో సీరియల్ న‌టుడు ప్ర‌భాక‌ర్ త‌న‌యుడు చంద్ర‌హాస్ పాల్గొన్నాడు. త‌ను రాసి ఓ పాట పాడాడు. పూర్తిగా బూతుతో కూడుకుని ఉన్న‌ది. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంత‌రం వ్య‌క్తం

Lokayukta Raids: రిటైర్డ్‌ ఇంజినీర్‌ ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, టన్నుల్లో తేనె లభ్యంLokayukta Raids: రిటైర్డ్‌ ఇంజినీర్‌ ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, టన్నుల్లో తేనె లభ్యం

Lokayukta Raids : మధ్యప్రదేశ్‌లో పదవీ విరమణ పొందిన ఓ ప్రభుత్వ ఇంజినీర్‌ సంపద చూసి అధికారులే అవాక్కయ్యారు. లోకాయుక్త అధికారులు ఆయన ఇళ్లల్లో సోదాలకు వెళ్లగా… నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం, వెండి లభించాయి. ఇక ఆయన ఫామ్‌హౌస్‌లో