hyderabadupdates.com Gallery శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో మోసం నిందితుడు అరెస్ట్

శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో మోసం నిందితుడు అరెస్ట్

శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో మోసం నిందితుడు అరెస్ట్ post thumbnail image

తిరుప‌తి : తిరుమలలో శ్రీవారి వీఐపీ దర్శనం కల్పిస్తామని సోషల్ మీడియా వేదికల ద్వారా అమాయక భక్తులను మోసం చేస్తున్న తమిళనాడు రాష్ట్రం లోని తిరువల్లూరు జిల్లాకు చెందిన సి. సెంథిల్ కుమార్ (47 సంవత్సరాలు) ను తిరుమల II టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల కాలంలో వాట్సాప్ , ఫేస్ బుక్ , ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలలో త్వరితగతిన శ్రీవారి దర్శనం. అత్యంత సమీపంలో దర్శనం వంటి తప్పుడు ప్రకటనలతో భక్తులను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. టీటీడీ విజిలెన్స్ విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమల II టౌన్ పోలీస్ స్టేషన్‌తో పాటు తిరుమల I టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ కేసులు నమోదు చేశారు పోలీసులు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుమల సబ్ డివిజన్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు. వీరికి వచ్చిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు ప్రాంతంలో దర్యాప్తు నిర్వహించి నిందితుడిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా “VIP దర్శనం టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి” అంటూ తప్పుడు ప్రచారం చేశాడు. అంతే కాకుండా టీటీడీ లోగోను దుర్వినియోగం చేసి భక్తులను నమ్మ బలికించడం . ఒక్కో టిక్కెట్‌కు సుమారు రూ. 16,500/- వసూలు చేయడం , కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలు, ఫోన్ పే ద్వారా డబ్బులు స్వీకరించడం, నకిలీ హామీలతో భక్తులను మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఇతని వద్దనుండి ఒక డెల్ ల్యాప్టాప్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ పరికరాలలో దర్శనం టిక్కెట్ల బుకింగ్‌కు సంబంధించిన డేటా, ఏఐ వీడియోలు, సోషల్ మీడియా చాట్ రికార్డులు లభించాయి.
ఇదిలా ఉండ‌గా తిరుమల దర్శనం టిక్కెట్లు కేవలం అధికారిక TTD వెబ్‌సైట్ లేదా అనుమతించబడిన కౌంటర్ల ద్వారానే పొందాలని సూచించారు ఎస్పీ సుబ్బారాయుడు. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మవ‌ద్ద‌ని, అనుమానాస్పద సమాచారం ఉన్నప్పుడు సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాల‌ని కోరారు.
The post శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో మోసం నిందితుడు అరెస్ట్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Chandrababu: కుటుంబసభ్యులతో సీఎం చంద్రబాబు దీపావళి సంబరాలుCM Chandrababu: కుటుంబసభ్యులతో సీఎం చంద్రబాబు దీపావళి సంబరాలు

    ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పల్లె, పట్టణాలు, నగరాలు అని తేడా లేకుండా వీధులన్నీ ప్రజలతో నిండిపోయాయి. సోమవారం సాయంత్రం నుంచే వయసుతో సంబంధం లేకుండా ప్రజలంతా రోడ్లపైకి వచ్చి టపాసులు పేలుస్తూ ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు.

సోష‌ల్ మీడియా నియంత్ర‌ణ‌పై కేంద్రం ఉక్కుపాదంసోష‌ల్ మీడియా నియంత్ర‌ణ‌పై కేంద్రం ఉక్కుపాదం

న్యూఢిల్లీ : కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ఎన్డీయే స‌ర్కార్ సోష‌ల్ మీడియాపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ద‌మైంది. ఇప్ప‌టికే ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార మాధ్య‌మాల‌ను నియంత్ర‌ణ‌లోకి తెచ్చుకున్న ప్ర‌ధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర‌షాల ద్వ‌యం మ‌రోసారి త‌మ‌కు

ఇక ఆన్‌లైన్ రోడ్డు భద్రతా పరీక్ష త‌ప్ప‌నిస‌రిఇక ఆన్‌లైన్ రోడ్డు భద్రతా పరీక్ష త‌ప్ప‌నిస‌రి

హైద‌రాబాద్ : వాహ‌న దారుల‌కు బిగ్ షాక్ ఇచ్చింది తెలంగాణ స‌ర్కార్. లెర్నర్ లైసెన్స్‌కు ముందు ఆన్‌లైన్ రోడ్డు భద్రతా పరీక్షను త‌ప్ప‌నిస‌రి చేసింది . దీంతో వాహ‌నదారుల‌కు కోలుకోలేని షాక్ త‌గిలింది. దరఖాస్తుదారుల కోసం మూడు గంటల అవగాహన మాడ్యూల్‌ను