కోల్ కతా : భారత జట్టు మాజీ కెప్టెన్ , బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో టీం ఇండియా వెస్టిండీస్ పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంలో ముఖ్య భూమిక పోషించాడు కేరళ స్టార్ ప్లేయర్ సంజు శాంసన్. తను ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. విండీస్ చేతిలోకి దాదాపు వెళ్లిన మ్యాచ్ ను భారత్ ముంగిట్లోకి తీసుకు వచ్చాడు. తను కేవలం 50 బంతులు మాత్రమే ఆడాడు. ఇందులో 12 ఫోర్లు 4 భారీ సిక్సులు ఉన్నాయి. మొత్తం 97 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. జట్టు గెలుపు సాధించేంత వరకు నిద్ర పోలేదు తను. గత కొంత కాలంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తొట్రుపాటుకు గురి కాకుండా సంయమనంతో ఆడాడు. ఇండియాను సెమీ ఫైనల్ కు చేర్చాడు శాంసన్.
ఈ సందర్బంగా గంగూలీ స్పందించాడు. సంజు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను ఏమిటో, తనలో ఉన్న సత్తా ఏపాటిదో ఈ మ్యాచ్ ద్వారా ఆచరణలో చేసి చూపించాడని కితాబు ఇచ్చాడు గంగూలీ. ఇదిలా ఉండగా గత ఆరు నెలలుగా జట్టులో చోటు దక్కించుకునేందుకు నానా తంటాలు పడ్డాడు. ఇషాన్ కిషన్ ఓపెనింగ్ అయినా లేదా మరెవరైనా వచ్చినా జట్టులో చోటు దక్కించు కోలేక పోయాడు. ప్రపంచ కప్కు ముందు, సంజు మళ్లీ విఫలమయ్యాడని, అతను జట్టులో చోటు దక్కించు కోలేడని, భారత్లో ఇంత ప్రతిభ ఉందని, శుభ్మాన్ గిల్ ఎందుకు లేడని ప్రశ్నలు వెల్లువలా వచ్చాయి. కానీ క్వార్టర్ ఫైనల్ లో అనూహ్యంగా వచ్చాడు. సత్తా చాటాడు. ఇండియాకు చిరస్మరణీయమైన గెలుపు అందించాడని పేర్కొన్నాడు దాదా.
The post సంజు శాంసన్ తన సత్తా ఏమిటో చూపించాడు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
సంజు శాంసన్ తన సత్తా ఏమిటో చూపించాడు
Categories: