hyderabadupdates.com movies ‘సంతానం’ కోసం సరదాలు ఇబ్బందులు

‘సంతానం’ కోసం సరదాలు ఇబ్బందులు

స్టార్ క్యాస్టింగ్ లేని సినిమాలు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కావాలంటే కంటెంట్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు. దాంతో ఎంత బాగా ఆడియన్స్ ని మెప్పించగలిగితే అంత వసూళ్లు చూడొచ్చు. బలగం నుంచి లిటిల్ హార్ట్స్ దాకా ఎన్నో సూపర్ హిట్స్ దీన్ని ఋజువు చేశాయి. వచ్చే వారం నవంబర్ 14 విడుదల కాబోతున్న సంతాన ప్రాప్తిరస్తు ఇదే క్యాటగిరీలో వచ్చే లక్ష్యంతో థియేటర్లలో అడుగు పెడుతోంది. ఏబిసిడి ఫేమ్ సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ ఎంటర్ టైనర్ ని మధుర శ్రీధర్ నిర్మించారు. ఇవాళ ట్రైలర్ ని లాంచ్ చేశారు. కథ విషయంలో అనవసరంగా ట్విస్టులను దాచకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు.  

మంచి ఉద్యోగం చేసే ఓ కుర్రాడు (విక్రాంత్) ఓ అమ్మాయి(చాందిని చౌదరి) ని చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. ఆమె తండ్రి (మురళీధర్ గౌడ్) కి అంతగా ఇష్టం లేకపోయినా ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. అయితే అందమైన ఈ జంటకు సంతానం కలగదు. డాక్టర్ ను వెళ్లి కలుసుకుంటే అబ్బాయిలో వీర్య కణాలు తక్కువగా ఉన్నాయని చెబుతారు. దీంతో ట్రీట్ మెంట్ కోసం మరో వైద్యుడు (వెన్నెల కిషోర్) ని సంప్రదిస్తే అతను ఖరీదయిన ఔషధాలు ఇస్తాడు. ట్రీట్ మెంట్ మొదలవుతుంది కానీ సంతాన భాగ్యం కనిపించదు. తర్వాత ఏం చేశారు, ఈ జంట ప్రయాణం ఎక్కడికి వెళ్లిందనేది తెరమీద చూడాలి.

ఇలాంటి కాన్సెప్ట్ తో తెలుగులో సినిమా రాలేదని చెప్పాలి. కొంచెం రిస్క్ అనిపించే ఇలాంటి బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకులను మెప్పించడం సవాలే. వినోదాన్ని జోడించి దర్శకుడు సంజీవ్ రెడ్డి దీన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేయడం బాగుంది. విక్రాంత్, చాందిని చౌదరి జంటతో పాటు సునీల్ కశ్యప్ సంగీతం లాంటి సాంకేతిక అంశాలు ప్లస్ అయ్యేలా ఉన్నాయి. పెద్దగా పోటీ లేని టైంలో వస్తున్న సంతాన ప్రాప్తిరస్తు ట్రైలర్ తో చూపించినట్టు నవ్వులు, ఎమోషన్స్ ని బ్యాలన్స్ చేయగలిగితే హిట్టు పడ్డట్టే. హీరో హీరోయిన్, డైరెక్టర్ తో పాటు ప్రతి ఒక్కరికి ఈ మూవీ హిట్ కావడం చాలా అవసరం.

Related Post

11 సీట్లు ఎలా వచ్చాయన్నదానిపై కోటి సంతకాలు చేయించాలి11 సీట్లు ఎలా వచ్చాయన్నదానిపై కోటి సంతకాలు చేయించాలి

ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్‌లైన్‌ను మళ్లీ మళ్లీ పొడిగించారు. కోటి సంతకాలు సేకరించి గవర్నర్ నజీర్‌ను కలిసి పీపీపీకి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవాలన్నది వైసీపీ

న‌న్ను 420 అన్నారు.. వాళ్లే 420 అయ్యారు: చంద్ర‌బాబున‌న్ను 420 అన్నారు.. వాళ్లే 420 అయ్యారు: చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో త‌న‌ను 420 అంటూ విమ‌ర్శించిన వారే(వైసీపీ నేత‌లు).. ఇప్పుడు 420 అయ్యార‌ని అన్నారు. అన్ని విధాలా.. రాష్ట్రాన్ని ప్ర‌జ‌లను కూడా మోసం చేశార‌ని బాబు విమ‌ర్శించారు. దీంతో