hyderabadupdates.com Gallery సిగ్గుంటే కేసీఆర్‌ రాజీనామా చేయాలి : సీఎం

సిగ్గుంటే కేసీఆర్‌ రాజీనామా చేయాలి : సీఎం

సిగ్గుంటే కేసీఆర్‌ రాజీనామా చేయాలి : సీఎం post thumbnail image

హైద‌రాబాద్ : రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గ‌త ప‌దేళ్ల బీఆర్ఎస్ పాల‌నా కాలంలో అందినంత మేర క‌ల్వ‌కుంట్ల కుటుంబం అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు . శాస‌న స‌భ సాక్షిగా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. శాసనసభకు రాని కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. జీతం తీసుకుంటూ ఇంట్లోనే కూర్చుంటే ఎలాగని ప్రశ్నించారు. సిగ్గుంటే ఆయనతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటిపై ఆరోపణలను కొట్టిపారేవారు. ద‌మ్ముంటే బీఆర్ఎస్ నేత‌లు కేటీఆర్, త‌న్నీరు హ‌రీష్ రావులు త‌మ వ‌ద్ద‌ ఆధారాలుంటే సీబీసీఐడీకి ఇవ్వాలని సవాల్ విసిరారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.
“గురివింద గింజ తన కింద నలుపు ఎరుగదన్నట్లు” విపక్షాల తీరు ఉందని ఎద్దేవా చేశారు. పేదల కోసం పనిచేసే తమ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదమని మండిపడ్డారు. ఇప్పటి వరకు 1 కోటి పది లక్షలు జీతం తీసుకుని కనీసం అసెంబ్లీకి కూడా రాని మాజీ సీఎం చంద్రశేఖర రావును రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంట్లో పడుకున్నఆయన ప్రజల సొమ్మును తిన‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.
రోజూ 18 గంటలు పనిచేస్తూ రాష్ట్ర మంతటా తిరుగుతూ ప్రజలకోసం పనిచేస్తూ.. లక్షలాది దళిత గిరిజన ఆదివాసిలకు ఇండ్లిచ్చి వారి ఇండ్లలో వెలుగు, కళ్ళల్లో ఆనందం నింపుతున్న మంత్రి పొంగులేటి రాజీనామా చేయమనడానికి సిగ్గుండాలి అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
The post సిగ్గుంటే కేసీఆర్‌ రాజీనామా చేయాలి : సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఇరాన్ త‌ల‌వంచితే స‌రి లేదంటే నాశ‌న‌మేఇరాన్ త‌ల‌వంచితే స‌రి లేదంటే నాశ‌న‌మే

అమెరికా : ఇరాన్ త‌మ దారికి రావాల‌ని, దాడుల‌ను ఆపాల‌ని లేక పోతే నాశ‌నం కాక త‌ప్ప‌ద‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆదివారం ఆయ‌న జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. హోర్ముజ్‌ను తెరవండి లేదా విద్యుత్

త‌ల్లిదండ్రులు అనాథ‌లు కాకూడ‌ద‌నే చ‌ట్టం తెచ్చాంత‌ల్లిదండ్రులు అనాథ‌లు కాకూడ‌ద‌నే చ‌ట్టం తెచ్చాం

హైద‌రాబాద్ : శాస‌న స‌భ సాక్షిగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ సమాజంలో ఏ కుటుంబంలోనూ తల్లిదండ్రులు అనాథలుగా మిగిలి పోకూడదన్న సంకల్పంతోనే ప్రభుత్వం తల్లిదండ్రుల రక్షణ కోసం చట్టం తీసుకొస్తుందని అన్నారు. ఈ సంద‌ర్భంగా

టీం ఇండియా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేతటీం ఇండియా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత

అహ్మ‌దాబాద్ : సూర్య కుమార్ యాద‌వ్ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా నిలిచింది. ఆదివారం జ‌రిగిన కీల‌క పోరులో భార‌త్ అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ స‌త్తా చాటింది. ఈ టోర్నీ లో మ‌రోసారి