hyderabadupdates.com Gallery సినిమా టికెట్ల ధ‌ర‌ల స‌మ‌స్య‌ల‌పై స‌మాచారం లేదు

సినిమా టికెట్ల ధ‌ర‌ల స‌మ‌స్య‌ల‌పై స‌మాచారం లేదు

సినిమా టికెట్ల ధ‌ర‌ల స‌మ‌స్య‌ల‌పై స‌మాచారం లేదు post thumbnail image

హైద‌రాబాద్ : రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల, సినిమాటోగ్ర‌ఫీ శాఖ‌ల మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో సినిమా టికెట్ల ధరల సమస్యపై ఎలాంటి సమాచారం లేదన్నారు. పుష్ప-2 సినిమా తర్వాత బెనిఫిట్ షో, సినిమా టికెట్ల ధరలను పెంచాలని కోరుతూ తనను సంప్రదించ వద్దని తాను నిర్మాతలకు స్పష్టంగా చెప్పానని అన్నారు. అందుకే ఆ విష‌యం గురించి తన‌ను అడ‌గ వ‌ద్ద‌ని కోరారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. ప్ర‌స్తుతానికి సినిమా శాఖ‌ను చూస్తున్న‌ప్ప‌టికీ తాను అంత‌గా వాటి జోలికి వెళ్ల‌డం లేద‌ని చెప్పారు. కొంద‌రు కావాల‌ని ప‌దే ప‌దే త‌న‌ను బ‌ద్నాం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.
ప‌దే ప‌దే త‌న‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేయ‌డం, నిరాధార‌మైన వార్త‌ల‌ను , క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేస్తూ త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్టకు భంగం క‌లిగించేలా చేస్తున్నారంటూ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి వాపోయారు. మంత్రిగా ఉన్నా సినీ ప‌రిశ్ర‌మ అంటేనే విసుగు వ‌చ్చింద‌న్నారు. అందుకే తాను సినీ పరిశ్రమ గురించి ఆలోచించడం మానేశానని స్పష్టం చేశారు. తనపై వస్తున్న వదంతులపై స్పష్టత ఇచ్చేందుకు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గతంలో విడుదలైన రెండు సినిమాలకు, శుక్రవారం విడుదలైన మరో సినిమాకు, సోమవారం విడుదల కాబోయే ఇంకో సినిమాకు టికెట్ల ధరలు పెంచడానికి సంబంధించిన ఏ ఫైల్ కూడా నాకు అందలేదని బాంబు పేల్చారు. ఓ ఐఏఎస్ అధికారిణితో త‌న‌కు లింకు ఉందంటూ ఓ ఛాన‌ల్ ప్ర‌సారం చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.
The post సినిమా టికెట్ల ధ‌ర‌ల స‌మ‌స్య‌ల‌పై స‌మాచారం లేదు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

గోదావ‌రి పుష్క‌రాలు ఘ‌నంగా నిర్వహించాలిగోదావ‌రి పుష్క‌రాలు ఘ‌నంగా నిర్వహించాలి

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం సాంస్కృతిక‌, ప‌ర్యాట‌క రంగానికి ప్ర‌యారిటీ ఇస్తోంద‌ని చెప్పారు. ఆధ్యాత్మ‌కత ఉట్టి ప‌డేలా ఆల‌యాల‌ను కూడా స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దుతున్న‌ట్లు తెలిపారు. ఇదిలా ఉండ‌గా తాజాగా

Supreme Court: దీపావళికి అనుమతి ఇవ్వండి – సుప్రీం కోర్టుకు రాష్ట్రాల విజ్ఞప్తిSupreme Court: దీపావళికి అనుమతి ఇవ్వండి – సుప్రీం కోర్టుకు రాష్ట్రాల విజ్ఞప్తి

Supreme Court : దిల్లీ ఎన్సీఆర్‌ పరిధిలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే ఉన్నందున బాణసంచా విక్రయాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం (Supreme Court) ఏప్రిల్‌ 3న తీర్పునిచ్చింది. ఈ విషయంపై పలు రాష్ట్రాలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీపావళి కోసం

ఏపీ, త‌మిళ‌నాడు ప్రజలది అన్నదమ్ముల బంధంఏపీ, త‌మిళ‌నాడు ప్రజలది అన్నదమ్ముల బంధం

త‌మిళ‌నాడు : ఏపీ, తమిళ‌నాడు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ది అన్న‌ద‌మ్ముల అనుబంధం ఉంద‌న్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. తమిళనాడు ఎన్నిక‌ల సంద‌ర్బంగా మంగళ‌వారం జ‌రిగిన‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి పాల్గొని ప్ర‌సంగించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో