hyderabadupdates.com Gallery స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అమ‌లు

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అమ‌లు

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అమ‌లు post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు, ప‌ర్మిష‌న్ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించి నేషనల్ బిల్డింగ్ కోడ్ స్థానంలో రాష్ట్ర నిబంధనలు పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. డబుల్ లైసెన్సింగ్ తరహా పద్దతులను తప్పించాలని సీఎం సూచించారు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే జీవిత కాలం చెల్లుబాటు కావాలని స్ప‌ష్టం చేశారు. మే నెలాఖరులోగా డి-రెగ్యులేషన్ ఫేజ్-2 అమల్లోకి వచ్చేలా చూడాలన్నారు. ఆ మేరకు ఆర్డినెన్సులు తీసుకు రావాలని నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశించారు. దరఖాస్తు నుంచి అనుమతుల వరకూ మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్ చేయాలని స్ప‌ష్టం చేశారు. ఫేజ్-2 అమలు తర్వాత పరిశ్రమల అనుమతులకు, ఏర్పాటుకు ఇప్పుడున్న ప్రక్రియలో 40 శాతం మేర సమయం తగ్గాలని సూచించారు.
పరిశ్రమలకు అనుమతులు, నిబంధనలను సడలించే విషయంలో తమ ప్రతిపాదనల కంటే రాష్ట్రం చాలా ముందుందని ప్ర‌శంస‌లు కురిపించారు కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్. సోమ‌వారం ఆయ‌న త‌న బృందంతో క‌లిసి సీఎం చంద్ర‌బాబు నాయుడుతో భేటీ అయ్యారు. కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. తాము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అమలు చేస్తున్నామని కేంద్ర బృందానికి వివరించారు సీఎం. ప్రజలకు సేవలు అందించడం కోసం స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానాన్ని అవలంభిస్తున్నట్టు వెల్ల‌డించారు. డి-రెగ్యులేషన్ ఫేజ్-3ను చేపడుతున్నారా అని స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ ను అడిగారు. జూన్ నెల నుంచి ఫేజ్-3పై పని చేస్తామని చెప్పారు.
The post స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం అమ‌లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సూర్య కుమార్ యాద‌వ్ ఎమోషన‌ల్సూర్య కుమార్ యాద‌వ్ ఎమోషన‌ల్

అహ్మ‌దాబాద్ : త‌న సార‌థ్యంలో భార‌త జ‌ట్టు వ‌రుస‌గా రెండుసార్లు ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచు కోవ‌డం ప‌ట్ల తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యాడు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్. ఇది అంద‌రం క‌లిసిక‌ట్టుగా ఆడ‌డం వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌ని అన్నాడు. ఇది

ఆరోగ్య శ్రీ కోసం రూ. 2,408 కోట్లు చెల్లించాం : సీఎంఆరోగ్య శ్రీ కోసం రూ. 2,408 కోట్లు చెల్లించాం : సీఎం

హైద‌రాబాద్ : ఆరోగ్య శ్రీ బ‌కాయిల‌కు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. గురువారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వ‌ద్ద మాట్లాడారు. డిసెంబ‌ర్ 6 , 2023 వ‌ర‌కు ఆరోగ్య శ్రీ కోసం ప్ర‌తి నెల యావ‌రేజ్

ఏపీకి రియ‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్ సీఎంఏపీకి రియ‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్ సీఎం

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి నిజ‌మైన బ్రాండ్ అంబాసిడ‌ర్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అని పేర్కొన్నారు త‌న‌యుడు, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఆయ‌న చేసిన తాజా వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపాయి.