hyderabadupdates.com Gallery హెచ్ -1బి వీసా ముగించే బిల్లుకు శ్రీ‌కారం

హెచ్ -1బి వీసా ముగించే బిల్లుకు శ్రీ‌కారం

హెచ్ -1బి వీసా ముగించే బిల్లుకు శ్రీ‌కారం post thumbnail image

అమెరికా : ప్ర‌వాస భార‌తీయుల‌కు కోలుకోలేని షాక్ నిర్ణ‌యం తీసుకుంది అమెరికా స‌ర్కార్. హెచ్ -1బి వీసా కార్య‌క్ర‌మాన్ని ముగించ‌చే బిల్లును యుఎస్ శాస‌న స‌భ్యుడు ఇవాళ ప్ర‌వేశ పెట్టారు స‌భ‌లో. ఫ్లోరిడాకు చెంద‌ని రిప‌బ్లిక‌న్ ప్ర‌తినిధి గ్రెగ్ స్టీబ్ ఎండింగ్ ఎక్స్‌ప్లోయేటివ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎక్సెప్షన్స్ యాక్ట్ లేదా ఎక్సైల్ యాక్ట్’ను ప్రవేశ పెట్టారు. వీసా కార్యక్రమాన్ని ముగించడం ద్వారా ఇమ్మిగ్రేషన్ జాతీయత చట్టాన్ని సవరించే బిల్లు ఇది. కార్పొరేషన్లు పదే పదే ఈ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నాయని, అమెరికాలోకి చౌకైన విదేశీ కార్మికులను దిగుమతి చేసుకుంటున్నాయని చెబుతూ హెచ్ 1బి వీసా కార్య‌క్ర‌మాన్ని ముగించేందుకు బిల్లును ప్ర‌వేశ పెట్టారు.
అమెరికన్ పౌరుల శ్రేయస్సు కంటే విదేశీ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వడం మన విలువలు , జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది అని స్టీబ్ పేర్కొన్నారు. త‌మ శ్రామిక శక్తిని పణంగా పెట్టి కార్పొరేషన్లు , విదేశీ పోటీదారులకు అవార్డులు ఇచ్చే హెచ్ 1బి వీసా కార్యక్రమం ద్వారా త‌మ దేశానికి చెందిన కార్మికులు, నిపుణుల‌కు ఉపాధి లేకుండా పోతుంద‌ని ఆవేద‌న చెందారు. అమెరికా నుండి పని చేస్తున్న అమెరికన్లను మళ్లీ మొదటి స్థానంలో ఉంచడానికి ప్రవాస చట్టాన్ని ప్రవేశ పెడుతున్న‌ట్లు చెప్పారు. కాగా అమెరికాలో నివ‌సించేందుకు, ప‌ని చేసేందుకు పెద్ద సంఖ్య‌లో భార‌తీయ నిపుణులు ఈ వీసాల‌ను ఉప‌యోగిస్తున్నారు. ట్రంప్ వ‌చ్చాక చ‌ట్ట విరుద్ద‌మైన వ‌ల‌స‌పై ఉక్కుపాదం మోపింది.
The post హెచ్ -1బి వీసా ముగించే బిల్లుకు శ్రీ‌కారం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Ramachander Rao: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో గెలుపు మాదే – బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావుRamachander Rao: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో గెలుపు మాదే – బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు

Ramachander Rao : బీసీలను భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ మోసం చేశాయని బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు విమర్శించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గ్రేటర్‌ పరిధి జిల్లాల సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ప్రచారం, అనుసరించాల్సిన

తిరుప‌తి లాగా మేడారం ఆలయాన్ని అభివృద్ది చేస్తాంతిరుప‌తి లాగా మేడారం ఆలయాన్ని అభివృద్ది చేస్తాం

వ‌రంగ‌ల్ జిల్లా : సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.ఆదివాసీ వీరవనితలు సమ్మక్క, సారలమ్మలు కొలువైన మేడారం పుణ్యక్షేత్రం.. జంపన్న వాగులో నిరంతరం నీరు ప్రవహించే విధంగా రామప్ప – లక్నవరం నుంచి పైప్‌లైన్ ద్వారా నీటిని తరలిస్తామని అన్నారు.

ప్ర‌భాస్ రాజా సాబ్ త‌ప్ప‌కుండా హిట్ అవుతుందిప్ర‌భాస్ రాజా సాబ్ త‌ప్ప‌కుండా హిట్ అవుతుంది

హైద‌రాబాద్ : ద‌ర్శ‌కుడు మారుతి సీరియ‌స్ కామెంట్స్ చేశాడు. ప్ర‌భాస్ , మాళ‌విక మోహ‌న్, రిద్దీ కుమార్, నిధి అగ‌ర్వాల్ , సంజ‌య్ ద‌త్ తో క‌లిసి ది రాజా సాబ్ తీశాడు. దీనిని పీపుల్స్ మీడియా నిర్మించింది. భారీ బడ్జెట్