hyderabadupdates.com movies అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757 మంది ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా, శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్ల స్టైఫండ్‌ను ప్రస్తుతం ఇస్తున్న రూ.4,500 నుంచి నేరుగా రూ.12,500కు పెంచుతున్నట్లు వేదికపైనే ప్రకటించారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సంప్రదించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. డిసెంబర్ 22 నుంచి ట్రైనింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వచ్చిన ఈ ప్రకటనతో ట్రైనీ కానిస్టేబుళ్లు కేరింతలు కొట్టారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో యువతకు ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు. మెగా డీఎస్సీ, కానిస్టేబుల్ నియామకాల ద్వారా ఆ మాటను కార్యరూపంలోకి తెచ్చామని తెలిపారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి సమర్థతకే పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని హెల్తీ, వెల్తీ, హ్యాపీగా తీర్చిదిద్దేందుకే ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కొత్తగా విధుల్లో చేరుతున్న పోలీసు యువకులు నిబద్ధతతో ప్రజల భద్రత కోసం పనిచేయాలని పిలుపునిస్తూ, నియామక పత్రాలు అందుకున్న కానిస్టేబుళ్లందరికీ సీఎం అభినందనలు తెలియజేశారు.

కానిస్టేబుల్స్ స్టై ఫండ్ అంటూ కేకలు వేయడం గమనించి సీఎం కు తెలిపిన హోమ్ మంత్రి అనిత.వెంటనే డిప్యూటీ సీఎం పవన్ తో చర్చించి 4,500/- నుండి 12,000/- వరకు పెంచిన చంద్రబాబు.#Chandrababu #PawanKalyan #ApPolice pic.twitter.com/RcNH3rPdQd— Gulte (@GulteOfficial) December 16, 2025

Related Post

ఇండియాకి ఏపీ గేట్ వే: నారా లోకేష్‌ఇండియాకి ఏపీ గేట్ వే: నారా లోకేష్‌

ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టిస్తున్న మంత్రి నారా లోకేష్‌.. అక్క‌డి పెట్టుబ‌డి దారుల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నంలో బిజీబిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే సీఐఐ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన రోడ్ షోలో పాల్గొని.. పెట్టుబ‌డి దారుల తో చ‌ర్చ‌లు జ‌రిపారు. తాజాగా మ‌రో కీల‌క మైలురాయిని ఆయ‌న చేరుకున్నారు.

ఏపీలో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు రెడీ?ఏపీలో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు రెడీ?

ఏపీలో పంచాయ‌తీ ఎన్నిక‌ల ఘ‌ట్టం ప్రారంభం అయింది. ఎన్నిక‌ల‌కు సంబంధించిన ముంద‌స్తు కార్యాచ‌ర‌ణ‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి అనుమ‌తి ల‌భించింది. దీంతో ఓట‌ర్ల జాబితాను సిద్ధం చేసేందుకు రాష్ట్ర ఎన్నిక‌ల అధికారులు సిద్ధ‌మ‌య్యారు. గ్రామపంచాయితీ ఎన్నికల కోసం ఓటర్ జాబితాలు