hyderabadupdates.com Gallery ఆకట్టుకుంటున్న విద్యుత్ కాంతులు, పుష్పాలంకరణలు

ఆకట్టుకుంటున్న విద్యుత్ కాంతులు, పుష్పాలంకరణలు

ఆకట్టుకుంటున్న విద్యుత్ కాంతులు, పుష్పాలంకరణలు post thumbnail image

తిరుపతి : శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ చేపట్టిన విద్యుత్ కాంతులు, పుష్పాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీనివాస మంగాపురం పరిసర ప్రాంతాలు, జాతీయ రహదారులు, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తులను మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. ఇవి బ్రహ్మోత్సవాల వైభవాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్తూ పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సవంగా మారుస్తున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్న, మధ్య, పెద్ద పరిమాణాల్లో సుమారు 75కు పైగా అద్భుతమైన ఇల్యూమినేషన్ బోర్డులు ఏర్పాటు చేశారు. నాలుగు మాడ వీధులలో గరుత్మంతుడిపై మహావిష్ణువు, లక్ష్మీదేవి, ఆభరణాల వేంకటేశ్వర స్వామి, వినాయకుడు, లక్ష్మీ, గజ వాహనం, ఆదిశేషుడిపై మహావిష్ణువు, దశావతారాలు, అష్టలక్ష్మీ తదితర రూపాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
అదేవిధంగా శ్రీనివాస మంగాపురం–చెర్లోపల్లి పరిసర ప్రాంతాల్లో దశావతారాలు, అష్టలక్ష్మీలు, శ్రీవేంకటేశ్వర స్వామి, మహావిష్ణువు–లక్ష్మీదేవి, గజవాహనంపై లక్ష్మీదేవి, శంఖు–చక్రాలు, ఏనుగులు, కమలాలు, వారాహావతారం, తోరణాలు, చిన్న లక్ష్మీదేవి రూపాలు, అభయహస్తం, వజ్ర కిరీటం, కటిహస్తం, నైన్ వాట్స్ తోరణాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి . చెర్లోపల్లి–శ్రీనివాసమంగాపురం, చంద్రగిరి–కాలూరు మార్గాలు, జాతీయ రహదారుల వెంట ఎల్.ఈ.డి లైట్లతో డిజైన్ చేసిన ఆర్చ్‌లు ఏర్పాటు చేశారు. పుదిపట్ల జంక్షన్, శ్రీనివాసమంగాపురం–తిరుపతి పరిసరాలు, ఆలయ పుష్కరిణి, ఆలయం లోపల, వెలుపల, నాలుగు మాడ వీధులు, కార్ పార్కింగ్ ప్రాంతం, శ్రీనివాసమంగాపురం–నరసింగాపురం జంక్షన్, చంద్రగిరి బస్టాండ్, శ్రీనివాస మంగాపురం రైల్వే గేట్ తదితర ప్రాంతాలు రాత్రి వేళల్లో రజతంలా మెరిసిపోతూ బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక శోభను అందిస్తున్నాయి.
The post ఆకట్టుకుంటున్న విద్యుత్ కాంతులు, పుష్పాలంకరణలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Train Accident: ఛత్తీస్‌ గఢ్‌ లోఘోర రైలు ప్రమాదం ! 11 మంది మృతి !Train Accident: ఛత్తీస్‌ గఢ్‌ లోఘోర రైలు ప్రమాదం ! 11 మంది మృతి !

    ఛత్తీస్ గఢ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న గూడ్స్‌ను ప్యాసింజర్‌ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో లోకో పైలట్‌ సహా 11 మంది మృతి చెందగా మరో 20 మంది వరకు

‘జ‌న నాయ‌గ‌న్’ నిర్మాత ప‌ట్ల విజ‌య్ విచారం‘జ‌న నాయ‌గ‌న్’ నిర్మాత ప‌ట్ల విజ‌య్ విచారం

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కీల‌క‌మైన న‌టుడిగా ఉన్నారు ద‌ళ‌ప‌తి విజ‌య్. త‌ను ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు రాజ‌కీయాల‌లోకి వ‌స్తున్న‌ట్లు వెల్ల‌డించాడు. ఆపై టీవీకే పేరుతో పార్టీ ఏర్పాటు చేశాడు. ప్ర‌స్తుతం

Digital Arrest: టీడీపీ ఎమ్మెల్యే ‘డిజిటల్‌ అరెస్టు’ కేసులో ఎనిమిది మంది అరెస్టుDigital Arrest: టీడీపీ ఎమ్మెల్యే ‘డిజిటల్‌ అరెస్టు’ కేసులో ఎనిమిది మంది అరెస్టు

    ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్‌ కడప జిల్లా మైదుకూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను సైబర్‌ నేరగాళ్లు ‘డిజిటల్‌ అరెస్టు’చేసి, ఆయన నుంచి రూ.1.07 కోట్లు కాజేసిన కేసు కొలిక్కి వచ్చింది. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మొత్తం