hyderabadupdates.com Gallery ఆదిత్య ధ‌ర్ దురంధ‌ర్ -2 న‌చ్చింద‌న్న జ‌క్క‌న్న‌

ఆదిత్య ధ‌ర్ దురంధ‌ర్ -2 న‌చ్చింద‌న్న జ‌క్క‌న్న‌

ఆదిత్య ధ‌ర్ దురంధ‌ర్ -2 న‌చ్చింద‌న్న జ‌క్క‌న్న‌ post thumbnail image

హైద‌రాబాద్ : ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మూవీ దురంధ‌ర్ -2 చిత్రం ఆశించిన దానికంటే దూసుకు పోతోంది. క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. మార్చి 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా సినీ విశ్లేష‌కులు సినిమా మూవీపై స్పందించారు. తాజాగా దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. నాకు ధురందర్-1 చాలా నచ్చింద‌ని, కానీ ‘ది రివెంజ్’ పరిమాణంలోనూ, ఆత్మలోనూ అసలు చిత్రాన్ని మించి పోయిందన్నాడు. రచన, నటీనటుల ఎంపిక, సాంకేతిక నైపుణ్యం, సంగీతం, ప్రపంచ రూపకల్పన, దర్శకత్వం అన్నీ దోషరహితంగా ఉన్నాయి. కానీ, ఇందులోని భావోద్వేగ భరితమైన అంశాలే ఈ సినిమాకు అసలైన ఆధారాన్ని ఇచ్చాయని స్ప‌ష్టం చేశారు జ‌క్క‌న్న అలియాస్ ఎస్ఎస్ రాజ‌మౌళి.
రచన, భావోద్వేగాలతో నిండిన నిజమైన ఉత్కంఠను సృష్టించేలా కథలో మలుపులను అద్భుతంగా ఉంద‌న్నాడు . ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్ ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు. 4 గంటల నిడివి ఉన్న సినిమాను తీసి విడుదల చేయడానికి చాలా ధైర్యం కావాలన్నారు. చివరి ఫ్రేమ్ వరకు ప్రేక్షకులు సీట్లకు అతుక్కు పోవ‌డం ద‌ర్శ‌కుడి ప్ర‌తిభే కార‌ణ‌మ‌న్నారు. అద్భుతమైన నటన అని పేర్కొన్నారు. షెడ్డులో సోదరితో ఉన్న సన్నివేశం నటనలో ఒక మాస్టర్ క్లాస్. ఆ ప్రారంభం నుండి గుండెను పిండేసే క్లైమాక్స్ వరకు, హమ్జా జస్కిరత్‌గా మీరిద్దరూ మమ్మల్ని మంత్ర ముగ్ధులను చేశారని ప్ర‌శంసించారు.
The post ఆదిత్య ధ‌ర్ దురంధ‌ర్ -2 న‌చ్చింద‌న్న జ‌క్క‌న్న‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

మెగాస్టార్ మూవీ స‌క్సెస్ కోడ‌లు ఉపాస‌న ఖుష్మెగాస్టార్ మూవీ స‌క్సెస్ కోడ‌లు ఉపాస‌న ఖుష్

హైద‌రాబాద్ : అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేశ్, ల‌వ్లీ బ్యూటీ న‌య‌న‌తార , టీవీకే గ‌ణేష్ కీల‌క పాత్ర‌లు పోషించిన మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు మూవీ దుమ్ము రేపుతోంది. క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తోంది. పాజిటివ్

Sathya Sai Gramam: వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కల్చరల్ ఫెస్టివల్ లో పాల్గొన్న ఫిజీ అధ్యక్షుడుSathya Sai Gramam: వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కల్చరల్ ఫెస్టివల్ లో పాల్గొన్న ఫిజీ అధ్యక్షుడు

    సత్యసాయి గ్రామంలో జరుగుతున్న వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ ఫెస్టివల్ కార్యక్రమానికి ఫిజీ అధ్యక్షుడు హాజరయ్యారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని 100 దేశాలు ఒక్కతాటిపైకి రావడంపై ఆయన ప్రశంసలు కురిపించారు. సేవ, మానవత్వం, ఐక్యతకు ఇది

BJP: బీఎంసీ ఎన్నికలపై బీజేపీ కసరత్తుBJP: బీఎంసీ ఎన్నికలపై బీజేపీ కసరత్తు

  త్వరలో జరుగనున్న ప్రతిష్టాత్మక బ్రిహాన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ (BJP) కసరత్తు ప్రారంభించింది. మహాయుతి కూటమిలో భాగంగా 140 నుంచి 150 సీట్లలో పోటీ చేయాలని కమలనాథుల ఆలోచనగా ఉంది. బీజేపీ భాగస్వామ్య పార్టీ