hyderabadupdates.com movies ఇంటర్నెట్ సెన్సేషన్.. గంటకెంత అని అడుగుతున్నారు

ఇంటర్నెట్ సెన్సేషన్.. గంటకెంత అని అడుగుతున్నారు

గిరిజ ఓక్.. ఇటీవల సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. 37 ఏళ్ల ఈ మరాఠీ నటి గురించి కొన్ని వారాల ముందు వరకు జనానికి పెద్దగా తెలియదు. ఆమిర్ ఖాన్ మూవీ ‘తారే జమీన్ పర్’ సహా పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు వచ్చిన పాపులారిటీ అంతంతమాత్రమే. కానీ నటిగా ఎన్నో సినిమాలు, సీరియళ్లు చేసినా రాని గుర్తింపు.. ఇటీవల ఒక ఇంటర్వ్యూ వల్ల వచ్చింది. 

ఆ ఇంటర్వ్యూలో తన లుక్, తన హావభావాలు.. ఆమె చెప్పిన మాటలకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్స్ మాత్రమే కాదు.. గతంలో ఆమె నటించిన అనేక సినిమాల వీడియోలు కూడా కూడా వైరల్ అయ్యాయి. గిరిజకు కొన్ని రోజుల్లోనే తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. ఐతే ఈ పాపులారిటీ వల్ల ఆమె కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొంటోందట. నీ రేటెంత అంటూ నీచమైన మెసేజ్‌లు పెడుతున్నారని ఆమె వాపోయింది.

తనకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగాక ఎంతోమంది పాజిటివ్ కామెంట్లు పెట్టారని.. దాంతో పాటు కొన్ని దారుణమైన మెసేజ్‌లూ వస్తున్నాయని గిరిజ ఓక్ చెప్పింది. ‘‘నీతో గంట సేపు గడపాలంటే ఎంత తీసుకుంటావు’.. ‘‘నీ రేటు ఎంత’’ అంటూ చాలామంది తనకు మెసేజ్‌లు పెడుతున్నారని.. ఇలాంటి వాటికి లెక్కే లేదని గిరిజ ఆవేదన వ్యక్తం చేసింది. 

వీళ్లందరికీ నిజ జీవితంలో తాను ఎదురు పడితే తన వైపు కూడా చూడకపోవచ్చని.. ఒక వేళ చూసినా గౌరవంతోనే మాట్లాడతారు తప్ప ఇలాంటి నీచపు కామెంట్లు చేయరని ఆమె అభిప్రాయపడింది. కానీ ఆన్ లైన్లో మాత్రం నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారని గిరిజ వాపోయింది. ఇక తన ఇంటర్వ్యూ వల్ల మంచి పాపులారిటీ వచ్చినా.. అదేమీ అవకాశాలు తెచ్చిపెట్టడం లేదని గిరిజ చెప్పింది. కొత్తగా తనకు సినిమా ఆఫర్లేమీ రాలేదని.. తన జీవితంలో పెద్ద మార్పేమీ లేదని ఆమె తేల్చేసింది.

Related Post

రామ్ చేస్తున్నది రిస్క్ కాదా?రామ్ చేస్తున్నది రిస్క్ కాదా?

వరుసగా మాస్ సినిమాలు చేసి కొంచెం మొహం మొత్తించేసిన యువ కథానాయకుడు రామ్.. ఇప్పుడు రూటు మార్చాడు. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ లాంటి వెరైటీ మూవీతో అతను ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇది ఒక స్టార్ హీరోకు వీరాభిమాని అయిన కుర్రాడి

విజయ్ మాల్యా… ఇక్కడికి వస్తేనే విచారణవిజయ్ మాల్యా… ఇక్కడికి వస్తేనే విచారణ

పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా పిటిషన్‌ను విచారించాలంటే ఆయన ముందుగా భారత్‌కు తిరిగి రావాల్సిన అవసరం ఉందని బాంబే హైకోర్టు గురువారం స్పష్టం చేసింది. 2018లో అమల్లోకి వచ్చిన పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుల చట్టం చెల్లుబాటు సవాలు చేస్తూ