hyderabadupdates.com Gallery ఇండియాలో వ‌ర‌ల్డ్ కప్ మ్యాచ్ లు ఆడబోం

ఇండియాలో వ‌ర‌ల్డ్ కప్ మ్యాచ్ లు ఆడబోం

ఇండియాలో వ‌ర‌ల్డ్ కప్ మ్యాచ్ లు ఆడబోం post thumbnail image

బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్, ఇండియా దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్న నేప‌థ్యంలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ). వ‌చ్చే ఫిబ్ర‌వ‌రి నెల‌లో భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 మెగా టోర్నీ జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్బంగా ఇండియాలో ఆడే క్రికెట్ మ్యాచ్ ల‌ను తాము ఆడ‌బోమంటూ తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించి కీల‌క లేఖ రాసింది ఐసీసీకి. దీనిపై ప‌రిశీలించాల‌ని కోరింది. ఇదిలా ఉండ‌గా ఐసీసీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు టి20 ప్రపంచ కప్ కోసం భారతదేశానికి వెళ్లడానికి వ్యతిరేకంగా తన వైఖరిని ధృవీకరించింది . త‌మ ఆట‌గాళ్ల భ‌ద్ర‌త‌కు ముప్పు వాటిల్లే ప్ర‌మాదం ఉంద‌ని పేర్కొంది. ఇందులో రెండో నిర్ణ‌యం అనేది లేనే లేద‌ని స్ప‌ష్టం చేసింది.
ఇప్ప‌టికే భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య కూడా తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. గ‌త ఏడాది లో భార‌త్ ఆప‌రేష‌న్ సిందూర్ యాక్ష‌న్ చేప‌ట్టింది. దెబ్బ‌కు పాకిస్తాన్ దిగి వ‌చ్చింది. చివ‌ర‌కు పాకిస్తాన్ , ఇండియా దేశాల జ‌ట్ల మ‌ధ్య ఆయా దేశాల‌లో మ్యాచ్ లు జ‌ర‌గ‌డం లేదు. కేవ‌లం త‌ట‌స్థ ప్ర‌దేశాల‌లో మాత్ర‌మే మ్యాచ్ లు కొన‌సాగుతున్నాయి. అయితే ఐసీసీ మాత్రం రూల్స్ కు విరుద్దంగా వ్య‌వ‌హ‌రిస్తే మ్యాచ్ ల‌లో భారీగా కోత విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.. బంగ్లాదేశ్‌లో రాజకీయ అశాంతి, భారతదేశంతో సంబంధాలు దెబ్బతిన్న తర్వాత ఆటలను శ్రీలంకకు మార్చాలని బోర్డు ఐసీసీని అభ్య‌ర్థించింది. అయితే దీనిపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేద‌ని తెలిపింది.
The post ఇండియాలో వ‌ర‌ల్డ్ కప్ మ్యాచ్ లు ఆడబోం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Ex MLC Kavitha: సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయండి – కవిత డిమాండ్Ex MLC Kavitha: సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయండి – కవిత డిమాండ్

Ex MLC Kavitha : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవో, ఎన్నికల నోటిఫికేషన్‌ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును రేవంత్ సర్కార్ ఆశ్రయించాలని తెలంగాణ (Telangana) జాగృతి అధ్యక్షురాలు కవిత (Ex

Prashant Kishor: ప్రశాంత్‌ కిశోర్‌కు ఎన్నికల సంఘం నోటీసులుPrashant Kishor: ప్రశాంత్‌ కిశోర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు

Prashant Kishor : బీహార్ ఎన్నికల వేళ ఈసీ నకిలీ ఓటర్లపై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌కు (Prashant Kishor) ఎన్నికల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, బిహార్‌ రాష్ట్రాల్లో

Droupadi Murmu: బోట్స్‌వానా నుంచి భారత్‌కు 8 చీతాలు – రాష్ట్రపతి ముర్ము పర్యటనలో ఒప్పందంDroupadi Murmu: బోట్స్‌వానా నుంచి భారత్‌కు 8 చీతాలు – రాష్ట్రపతి ముర్ము పర్యటనలో ఒప్పందం

      భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము… దక్షిణాఫ్రికా పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాలోని బోట్స్‌వానాతో భారత్‌ పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆరోగ్యరంగం, ఫార్మా రంగాలకు సంబంధించి పలు అవగాహన ఒప్పందాల(ఎంఓయూలు)పై సంతకాలు చేసింది. ప్రస్తుతం రాష్ట్రపతి