hyderabadupdates.com movies ఇరానీ చాయ్ మీద ఇరాన్ వార్

ఇరానీ చాయ్ మీద ఇరాన్ వార్

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ గ్యాస్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడటంతో ఇప్పటికే ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో చాలా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. తాజాగా హైదరాబాద్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ ప్రాంతంలోని హాస్టళ్లు గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

ఐటీ కారిడార్ లోని సుమారు 1,100 హాస్టళ్లలో నివసిస్తున్న 10 నుంచి 11 లక్షల మంది ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. పొద్దున్నే ఇరానీ చాయ్ తాగే విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఇప్పుడు ఆ టీ కూడా తాగలేని పరిస్థితి ఏర్పడింది. టీ, కాఫీ, ఇడ్లీ, దోసె, చపాతీ, పూరీ వంటి బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్ మెనూల నుంచి మాయమయ్యాయి. వాటి బదులుగా సాంబార్ రైస్, పులిహోర, కర్డ్ రైస్ వంటి ఆహారాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

కొన్ని హాస్టళ్ల నిర్వాహకులు వంట చేసేందుకు కట్టెల పొయ్యులను ఉపయోగిస్తున్నారు. గ్యాస్ దాదాపు అయిపోయిందని, వేలాది మందికి భోజనం తయారు చేయడానికి గ్యాస్ సరిపోవడం లేదని ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ ట్రెజరర్ వెల్లంపల్లి మహీధర్ తెలిపారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 1,950 రూపాయల నుంచి 2,300 రూపాయలకు పెరిగినా కూడా దొరకడం లేదని చెప్పారు.

పరిస్థితి త్వరగా మెరుగుపడకపోతే హాస్టళ్లు మూసివేయాల్సి వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అలా జరిగితే ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని, చాలామంది తమ స్వస్థలాలకు వెళ్లే పరిస్థితి రావచ్చని తెలిపారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని హాస్టళ్లకు స్థిరంగా గ్యాస్ సరఫరా చేయాలని ఆయన కోరారు.

Related Post

ఫేక్ న్యూస్ వ‌ల్ల నా త‌ల్లి చ‌నిపోయింది-హేమ‌ఫేక్ న్యూస్ వ‌ల్ల నా త‌ల్లి చ‌నిపోయింది-హేమ‌

ఏడాదిన్న‌ర కింద‌ట బెంగ‌ళూరులో జ‌రిగిన ఒక రేవ్ పార్టీలో టాలీవుడ్ సీనియ‌ర్ న‌టి హేమ పాల్గొన్న‌ట్లు ఆరోప‌ణ‌లు రావ‌డం క‌ల‌కలం రేపిన సంగ‌తి తెలిసిందే. ఐతే తాను ఆ పార్టీకి హాజ‌రే కాలేద‌ని.. ఆ టైంలో తాను హైదరాబాద్‌లోని ఒక ఫాం

అప్పుడు పరశురామ్.. ఇప్పుడు ప్రశాంత్అప్పుడు పరశురామ్.. ఇప్పుడు ప్రశాంత్

‘హనుమాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్న ప్రశాంత్.. ఆ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి నుంచే కాక పలువురు ప్రొడ్యూసర్ల నుంచి పెద్ద మొత్తంలో అడ్వాన్సులు