hyderabadupdates.com Gallery ఉత్కంఠ భ‌రితం భార‌త్ అద్భుత విజ‌యం

ఉత్కంఠ భ‌రితం భార‌త్ అద్భుత విజ‌యం

ఉత్కంఠ భ‌రితం భార‌త్ అద్భుత విజ‌యం post thumbnail image

ముంబై : క్రికెట్ ఆట‌లో ఉన్న మ‌జా ఏమిటో ముంబై వేదిక‌గా జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచ్ తెలియ చేసింది. అందుకే కోట్లాది మంది క్రికెట్ అంటే ప‌డి చ‌స్తారు. నువ్వా నేనా అన్న రీతిలో జ‌రిగిన ఈ కీల‌క పోరు చివ‌రి ఓవ‌ర్ దాకా ఉత్కంఠ భ‌రితంగా సాగుతోంది. ఇక కేవ‌లం ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచి ఉంది టీం ఇండియా. తొలి సెమీ ఫైన‌ల్ లో బ‌ల‌మైన ద‌క్షిణాఫ్రికాకు చుక్క‌లు చూపించింది న్యూజిలాండ్. ఆ జ‌ట్టును 9 వికెట్ల తేడాతో ఓడించి ఫైన‌ల్ కు చేరుకుంది. ఈనెల 8న భార‌త్ తో త‌ల‌ప‌డ‌నుంది. దీంతో కోట్లాది మంది భార‌తీయులు ఈ కీల‌క పోరు కోసం వేచి చూస్తున్నారు.
ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే టాస్ ఓడిన భార‌త్ ముందుగా బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 253 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. కేర‌ళ స్టార్ శాంస‌న్ మ‌రోసారి రెచ్చి పోయాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టాడు. ప్ర‌త్యేకించి జోఫ్రా ఆర్చ‌ర్ ను ఉతికి ఆరేశాడు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో ఆకట్టుకున్నాడు. 89 ప‌రుగులు చేసిన త‌ను 8 ఫోర్లు 7 సిక్స‌ర్లు కొట్టాడు. త‌న‌కు తోడుగా ఇషాన్ కిష‌న్, హార్దిక్ పాండ్యా, తిల‌క్ వ‌ర్మ‌, శివ‌మ్ దూబేలు కీల‌క పాత్ర పోషించారు. ఇరు జ‌ట్లు 499 ర‌న్స్ చేశాయి. ఇది కూడా ఓ రికార్డ్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. భార‌త బౌల‌ర్లు ప్ర‌త్య‌కించి బుమ్రా, ప‌టేల్, పాండ్యాలు అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. ఇండియాను ఒడ్డుకు చేర్చారు.
The post ఉత్కంఠ భ‌రితం భార‌త్ అద్భుత విజ‌యం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఇక ఆన్‌లైన్ రోడ్డు భద్రతా పరీక్ష త‌ప్ప‌నిస‌రిఇక ఆన్‌లైన్ రోడ్డు భద్రతా పరీక్ష త‌ప్ప‌నిస‌రి

హైద‌రాబాద్ : వాహ‌న దారుల‌కు బిగ్ షాక్ ఇచ్చింది తెలంగాణ స‌ర్కార్. లెర్నర్ లైసెన్స్‌కు ముందు ఆన్‌లైన్ రోడ్డు భద్రతా పరీక్షను త‌ప్ప‌నిస‌రి చేసింది . దీంతో వాహ‌నదారుల‌కు కోలుకోలేని షాక్ త‌గిలింది. దరఖాస్తుదారుల కోసం మూడు గంటల అవగాహన మాడ్యూల్‌ను

Fire Crackers: దీపావళి ముందు సిక్కింలో బాణాసంచాపై నిషేధంFire Crackers: దీపావళి ముందు సిక్కింలో బాణాసంచాపై నిషేధం

    దీపావళికి ముందు ఈశాన్య రాష్ట్రమైన సిక్కిం బాణాసంచాను నిషేధించింది. అన్ని రకాల సౌండ్, ఫైర్‌క్రాకర్ల తయారీ, విక్రయం, పేల్చడాన్ని పూర్తిగా నిషేధించింది. అదే సమయంలో పండుగ సందర్భంగా సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌ల వాడకాన్ని నివారించాలని కూడా ప్రజలకు పిలుపునిచ్చింది. బదులుగా

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామంYS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం

  రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో తప్పుడు కేసులు నమోదు చేసిన ఇద్దరు పోలీసులపై చర్యలకు ఉపక్రమించారు పోలీస్ ఉన్నతాధికారులు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు