hyderabadupdates.com Gallery ఉపాధి హామీ ప‌థ‌కాన్ని పున‌రుద్ద‌రించాలి

ఉపాధి హామీ ప‌థ‌కాన్ని పున‌రుద్ద‌రించాలి

ఉపాధి హామీ ప‌థ‌కాన్ని పున‌రుద్ద‌రించాలి post thumbnail image

నెల్లూరు జిల్లా : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కాన్ని తిరిగి పునరుద్ద‌రించాల‌ని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఉపాధి హామీ ప‌థ‌క ప‌రిర‌క్ష‌ణ యాత్ర కొన‌సాగుతోంది. ఈ యాత్ర గురువారం నెల్లూరు జిల్లాకు చేరుకుంది. మునుబోలు మండలం అక్కంపేట గ్రామంలో జ‌రిగిన‌ మన్రేగా పరిరక్షణ సభలో పాల్గొని ప్ర‌సంగించారు. ఆనాడు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉన్న స‌మ‌యంలోనే ఏపీ ఉమ్మ‌డి రాష్ట్రం లో అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేశార‌ని గుర్తు చేశారు. పేద‌ల‌కు ఎంతో మేలు జరిగేలా చేశార‌న్నారు. ఉచిత క‌రెంట్ తో వ్య‌వ‌సాయాన్ని పండుగ‌గా మార్చేసిన ఘ‌న‌త వైఎస్సార్ దేన‌ని అన్నారు ష‌ర్మిలా రెడ్డి. ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కంతో పేద‌ల‌కు ఎంతో మేలు చేకూరింద‌న్నారు. కోట్లాది మందికి ఆరోగ్య ప‌రంగా సేవ‌లు అందాయ‌ని , ఇంకా అందుతూనే ఉన్నాయ‌న్నారు.
ఒక ర‌కంగా చెప్పాలంటే ఆరోగ్య శ్రీ ప‌థ‌కం పేద‌ల‌కు సంజీవినిగా మారింన్నారు ష‌ర్మిలా రెడ్డి. ఫీజు రీయంబర్స్ మెంట్ పథకంతో కోట్ల మంది ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు. ఒకటి కాదు రెండు కాదు YSR తెచ్చిన ప్రతి పథకం అద్భుతం అన్నారు. త‌న తండ్రి ఆశ‌యాల నుంచే క‌ర‌వు ప‌ని పుట్టింద‌ని చెప్పారు. 2006లో రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉన్న స‌మ‌యంలోనే అనంత‌పురం జిల్లాలో ఉపాధి హామీ ప‌థ‌కం ప్రారంభ‌మైంద‌న్నారు ఏపీపీసీసీ చీఫ్‌. మన్మోహన్ సింగ్ , సోనియా గాంధీ ఈ పథకాన్ని బండ్లపల్లి నుంచి ప్రారంభించార‌ని చెప్పారు. రాష్ట్ర గ్రామీణ అభివృద్దికి మ‌న్రేగా ప‌థ‌కం ఎంతో దోహ‌ద ప‌డేలా చేసింద‌న్నారు ష‌ర్మిలా రెడ్డి.
The post ఉపాధి హామీ ప‌థ‌కాన్ని పున‌రుద్ద‌రించాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Anmol Bishnoi: ఎన్ఐఏ కస్టడీకి గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్Anmol Bishnoi: ఎన్ఐఏ కస్టడీకి గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్

  ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యకేసుతో సహా పలు కేసుల్లో వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్‌ ను 11 రోజుల ఎన్ఐఏ (NIA) కస్టడీకి ఢిల్లీలోని పాటియాలా హౌస్‌కోర్టు బుధవారంనాడు అప్పగించింది. అన్మోల్‌ను అమెరికా డిపోర్ట్ చేయడంతో అక్కడి నుంచి

Special Intensive Revision: నేటి నుండి 9 రాష్ట్రాలు, 3 యూటీల్లో ఓటరు సమగ్ర సవరణSpecial Intensive Revision: నేటి నుండి 9 రాష్ట్రాలు, 3 యూటీల్లో ఓటరు సమగ్ర సవరణ

    దేశవ్యాప్తంగా ఓటరు సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియకు భారత ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం నుంచి శ్రీకారం చుట్టింది. 9 రాష్ట్రాలు, 3యూటీల్లో ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఏడో తేదీ వరకు కొనసాగే ఈ ప్రక్రియలో