ఢిల్లీ : తమిళనాడు సీఎం , డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కు బిగ్ రిలీఫ్ లభించింది. తనపై అన్నాడీఎంకే దాఖలు చేసిన పిటిషన్ పై తుది తీర్పును భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు గురువారం రిజర్వ్ చేసింది. ఇదిలా ఉండగా 2011లో ఎంకే స్టాలిన్ ఎన్నికను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ అన్నాడీఎంకే నేత సైదై ఎస్ దురైసామి పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో నియోజకవర్గంలో ఓటర్లకు డబ్బు పంపిణీ చేశారని, నిర్ణీత వ్యయ పరిమితిని మించి పోయారని, అలాగే అనుబంధ లెక్కింపు నిర్వహించారని ఏఐఏఎండీకే నేత దురైసామి ఆరోపించారు. ఎంకే స్టాలిన్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయన దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ అన్నాడీఎంకే నేత సైదై ఎస్ దురైసామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
విచారణలో భాగంగా రెండు పార్టీల తరపున హాజరైన న్యాయవాదుల వాదనలను న్యాయమూర్తులు జెకె మహేశ్వరి, విజయ్ బిష్ణోయ్లతో కూడిన ధర్మాసనం విచారించింది. 2011 ఎన్నికల్లో కొలత్తూర్ నుండి 2,739 ఓట్ల తేడాతో స్టాలిన్ చేతిలో ఓడిపోయిన దురైసామి ఎన్నికల పిటిషన్ను కొట్టివేసింది. నియోజకవర్గంలోని ఓటర్లకు నిర్దేశించిన ఖర్చు పరిమితిని మించి డబ్బు పంపిణీ చేశారని, అలాగే అనుబంధ లెక్కింపు నిర్వహించారని దురైసామి ఆరోపించారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 ప్రకారం అవినీతికి సమానమైన వినూత్న మార్గాల ద్వారా ఓటర్లను ఆకర్షించడానికి డీఎంకే తన కార్యకర్తలను , డబ్బును ఉపయోగించిందని దురైసామి ఆరోపించారు. కమ్యూనిటీ ఫీడింగ్లు, కొరియర్ సర్వీస్, వార్తాపత్రికలలో కరెన్సీ ని పంపిణీ చేశారని తెలిపారు.
The post ఎంకే స్టాలిన్ కేసును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ఎంకే స్టాలిన్ కేసును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
Categories: