hyderabadupdates.com Gallery ఎంద‌రో త్యాగాల ఫ‌లితం నేటి భార‌త దేశం

ఎంద‌రో త్యాగాల ఫ‌లితం నేటి భార‌త దేశం

ఎంద‌రో త్యాగాల ఫ‌లితం నేటి భార‌త దేశం post thumbnail image

అమ‌రావ‌తి : ఈ దేశ విముక్తి కోసం ఎంద‌రో త‌మ విలువైన ప్రాణాలు త్యాగం చేశారు. వారు చేసిన త్యాగాలు, బ‌లిదానాల వ‌ల్ల‌నే ఇవాళ భార‌త దేశం స‌మున్న‌త‌మైన రీతి లో ముందుకు సాగుతోంద‌ని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. 77వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా జ‌రిగిన వేడుక‌ల్లో రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా పోలీసుల నుంచి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. అనంత‌రం ప్ర‌సంగించారు నారా చంద్ర‌బాబు నాయుడు.
సుమారు 200 సంవ‌త్స‌రాల పాటు బ్రిటిష్ పాలకుల నుండి స్వాతంత్రం సిద్ధించడానికి, స్వాతంత్ర సమర యోధులు అహింసా సిద్ధాంతాన్ని ఆయుధంగా చేసుకుని భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కృషి చేశార‌ని చెప్పారు. ప్రపంచ దేశాలలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన నేపథ్యంలో 1950 జనవరి 26వ తేదీ నాడు గణతంత్ర దేశముగా ఏర్పడింద‌న్నారు. ఈ రోజును పురస్కరించుకొని భారత గణతంత్ర దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించికుంటూ వ‌స్తున్నామ‌న్నారు సీఎం. అప్పటి అమర వీరులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఈ రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియ జేశారు.
ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఈ గణతంత్ర దినోత్సవం ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచి పోతుంద‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ ముఖ్యమైన సందర్భంగా ప్రభుత్వ అజెండా, దార్శనికతను అనర్గళంగా వివరించినందుకు గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ కి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్న‌ట్లు తెలిపారు .
The post ఎంద‌రో త్యాగాల ఫ‌లితం నేటి భార‌త దేశం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

VVPAT Slips: బిహార్‌లో రోడ్డు పక్కన వీవీప్యాట్‌ స్లిప్పులుVVPAT Slips: బిహార్‌లో రోడ్డు పక్కన వీవీప్యాట్‌ స్లిప్పులు

    బిహార్‌లోని సమస్తీపుర్‌ జిల్లాలో రోడ్డు పక్కన అధిక సంఖ్యలో వీవీప్యాట్‌ స్లిప్పులు చెల్లాచెదురుగా పడి ఉండడం కలకలం రేపింది. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన ఎన్నికల సంఘం… ఓ సహాయ రిటర్నింగ్‌ అధికారిని (ఏఆర్‌వో) సస్పెండ్‌ చేయడంతో పాటు

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామంYS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం

  రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో తప్పుడు కేసులు నమోదు చేసిన ఇద్దరు పోలీసులపై చర్యలకు ఉపక్రమించారు పోలీస్ ఉన్నతాధికారులు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు

Indian Navy: ఆపరేషన్‌ సిందూర్‌పై నేవీ ‘కసమ్‌ సిందూర్‌కి’ పాటIndian Navy: ఆపరేషన్‌ సిందూర్‌పై నేవీ ‘కసమ్‌ సిందూర్‌కి’ పాట

Indian Navy : ప్రధాని నరేంద్రమోదీ సోమవారం గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో దీపావళి వేడుకలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బంది ఆపరేషన్‌ సిందూర్‌పై రాసిన ఓ పాటను ప్రధాని ఎదుట పాడారు. దానికి సంబంధించిన వీడియోను