hyderabadupdates.com Gallery ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య‌కు రూ. కోటి ఎక్స్ గ్రేషియా

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య‌కు రూ. కోటి ఎక్స్ గ్రేషియా

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య‌కు రూ. కోటి ఎక్స్ గ్రేషియా post thumbnail image

హైద‌రాబాద్ : స్మ‌గ్ల‌ర్ల దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డి నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఇవాళ క‌న్నుమూశారు. ఆమె మృతి ప‌ట్ల తెలంగాణ ప్ర‌భుత్వం తీవ్ర సంతాపం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు రూ. కోటి ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని ఆదివారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణ‌రావు వెల్ల‌డించారు. ఆమె మృతి ప‌ట్ల తీవ్ర ఆవేద‌న చెందారు. ఇది జ‌ర‌గ కూడ‌ద‌ని పేర్కొన్నారు. దీనిని సీరియ‌స్ గా తీసుకుంటామ‌న్నారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. క్షేత్రస్థాయి విధుల్లో ఉన్న ఎక్సైజ్ సిబ్బంది భద్రత కోసం వారికి ఆయుధాలు అందిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.
నిజామాబాద్‌లో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను అడ్డుకునే ప్రయత్నంలో సౌమ్య జనవరి 23న తీవ్రంగా గాయపడ్డారు. పారిపోయే ప్రయత్నంలో స్మగ్లర్లు కావాలనే తమ వాహనంతో త‌న‌ను ఢీకొట్టారు. నిజామాబాద్ జిల్లాలో విధి నిర్వహణలో ఉండగా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌న వ‌య‌సు 26 ఏళ్లు. వారి దాడి కార‌ణంగా త‌ను తీవ్రంగా గాయ‌ప‌డింది. త‌న‌ను హుటా హుటిన హైద‌రాబాద్ లోని నిమ్స్ కు త‌ర‌లించారు. కానీ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ లేదు. ఇవాళ సౌమ్య తుది శ్వాస విడిచారు. రాష్ట్రంలో గంజాయి స్మ‌గ్ల‌ర్లు పెద్ద ఎత్తున దందా నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మొత్తం విలువైన ప్రాణం కోల్పోవ‌డం తెలంగాణ ప్రాంతానికి తీర‌ని న‌ష్టం అని పేర్కొంది స‌ర్కార్.
The post ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య‌కు రూ. కోటి ఎక్స్ గ్రేషియా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Justice Surya Kant: నూతన సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ?Justice Surya Kant: నూతన సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ?

Justice Surya Kant : భారత సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ నియమితులు కానున్నారు. ఆయన పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ (BR Gavai) సోమవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. రాష్ట్రపతి ఆయన

టికెట్ రేట్ల పెంపు ప‌వ‌న్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్టికెట్ రేట్ల పెంపు ప‌వ‌న్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రానికి సంబంధించి సినిమా టికెట్ రేట్ల‌ను పెంచుకునేందుకు ఓకే చెప్పింది. ఇందుకు సంబంధించి సీఎస్ అధికారికంగా ఉత్త‌ర్వులు

Gujarat ATS: హైదరాబాద్ ఉగ్రవాది ఇంట్లో గుజరాత్‌ ఏటీఎస్‌ సోదాలుGujarat ATS: హైదరాబాద్ ఉగ్రవాది ఇంట్లో గుజరాత్‌ ఏటీఎస్‌ సోదాలు

    ఉగ్రవాద ఆరోపణలతో అరెస్టయిన డాక్టర్‌ సయ్యద్‌ అహ్మద్‌ మొహియుద్దిన్‌ నివాసంలో గుజరాత్‌ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌ (ఏటీ ఎస్‌)పోలీసులు బుధవారం సోదాలు నిర్వహించారు. రాజేంద్రనగర్‌లోని అతడి నివాసంలో 3 గంటలపాటు సోదాలు నిర్వహించి పలు పత్రాలు, రసాయనాలు, కంప్యూటర్‌