hyderabadupdates.com movies ఎ సర్టిఫికెట్ తో దురంధురుడి విధ్వంసం

ఎ సర్టిఫికెట్ తో దురంధురుడి విధ్వంసం

ఈ నెల మొదటి వారంలో ‘దురంధర్’ సినిమా రిలీజవుతుంటే.. దాని చుట్టూ చాలా వరకు నెగెటివిటీనే కనిపించింది. ఫ్లాపుల్లో ఉన్న రణ్వీర్ సింగ్‌ను చూడ్డానికి జనం వస్తారా.. ఏ ధైర్యంతో దీనిపై 350 కోట్ల బడ్జెట్ పెట్టారు.. మూడున్నర గంటలకు పైగా నిడివి అంటే తట్టుకోగలరా.. అడ్వాన్స్ బుకింగ్స్ డల్లుగా ఉన్నాయే అంటూ రకరకాల కామెంట్లు వినిపించాయి. కానీ రిలీజ్ తర్వాత అంతా మారిపోయింది.

సినిమాకు మోడరేట్ రివ్యూలు వచ్చినా సరే.. బాక్సాఫీస్ దగ్గర ఆ చిత్రం అద్భుతాలు చేస్తూ సాగిపోయింది. కొత్త సినిమాలకు రోజులు గడిచేకొద్దీ వసూళ్లు నెమ్మదించడం సహజం. కానీ ఈ చిత్రానికి అంతకంతకూ వసూళ్లు పెరుగుతూ పోయాయి. మూడో వారంలో కూడా జోరు తగ్గించలేదు దురంధర్. ‘అవతార్-3’ లాంటి క్రేజీ మూవీ వచ్చినా దాన్ని కూడా డామినేట్ చేసింది. తాజాగా ఈ మూవీ హిందీలో ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ‘ఛావా’ పేరిట ఉన్న రూ.800 కోట్ల మైలురాయిని ‘దురంధర్’ దాటేసింది.

ఇక ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్‌గా ‘దురంధర్’ నిలవడం కూడా లాంఛనమే. ‘కాంతార: చాప్టర్-1’ రూ.850 కోట్ల వసూళ్లతో రికార్డు నెలకొల్పింది. ‘దురంధర్’ మూడో వీకెండ్లోనూ రూ.95 కోట్ల వసూళ్లు సాధించడం విశేషం. హిందీలో ఈ వారం ‘తూ మేరీ మై తేరా.. మై తేరా తూ మేరీ’ సినిమా రాబోతోంది. దానికి కొంచెం క్రేజ్ ఉన్నా సరే.. ‘దురంధర్’ను డామినేట్ చేసే అవకాశాలు కనిపించడం లేదు.

క్రిస్మస్ వీకెండ్లోనూ కూడా రణ్వీర్ సినిమానే లీడ్ తీసుకునేలా ఉంది. వీకెండ్ వచ్చేలోపే ‘కాంతార’ రికార్డును బద్దలు కొట్టి రూ.1000 కోట్ల మైలురాయిని కూడా టార్గెట్ చేసేలా ఉంది ‘దురంధర్’. బాక్సాఫీస్ దగ్గర అన్నీ కలిసొస్తే.. ఈ ఏడాది వెయ్యి కోట్ల సినిమా లేని లోటును ఇది తీర్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫుల్ రన్లో రూ.వెయ్యి కోట్లు సాధ్యమే కానీ.. ఈ ఏడాదే ఆ రికార్డును అందుకుంటుందా లేదా అన్నదే సస్పెన్సు.

Related Post

రాజా సాబ్ బ్యూటీకి ప్రభాస్ ‘సారీ’ గిఫ్ట్రాజా సాబ్ బ్యూటీకి ప్రభాస్ ‘సారీ’ గిఫ్ట్

ప్రభాస్‌తో పని చేసే ప్రతి ఆర్టిస్టూ, టెక్నీషియనూ తన పెద్ద మనసు గురించి చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా కడుపు పగిలేలా తన ఇంటి విందు భోజనాలు పెట్టించి చంపేస్తుంటాడని సరదాగా వ్యాఖ్యానిస్తుంటారు తనతో పని చేసిన యూనిట్ సభ్యులు. ప్రభాస్‌తో కొత్తగా

ఏబీఎన్ రిపోర్టర్ పై బీఆర్ఎస్ దాడి.. ఎవరికి నష్టం?ఏబీఎన్ రిపోర్టర్ పై బీఆర్ఎస్ దాడి.. ఎవరికి నష్టం?

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ భవన్ దగ్గరకు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా లోకేష్ రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే.. ఆయ‌న ఏదైనా భారీ ప్రాజెక్టును ప్ర‌కటించ‌డానికి ముందు.. ప్ర‌జ‌ల‌కు స‌మ‌యం చెబుతున్న విష‌యం