hyderabadupdates.com Gallery ఏపీ రాష్ట్ర బ‌డ్జెట్ కొత్త సీసాలో పాత సారా : వైఎస్ ష‌ర్మిల

ఏపీ రాష్ట్ర బ‌డ్జెట్ కొత్త సీసాలో పాత సారా : వైఎస్ ష‌ర్మిల

ఏపీ రాష్ట్ర బ‌డ్జెట్ కొత్త సీసాలో పాత సారా :  వైఎస్ ష‌ర్మిల post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ స‌ర్కార్ తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 రాష్ట్ర బడ్జెట్ పై స్పందించారు. కొత్త సీసాలో పాత సారా సామెతను తలపించిందని అన్నారు. అంతా ఊహా జనితంగా, అభూత కల్పనలతో ఉందంటూ మండిప‌డ్డారు. అంకెలు ఘనం.. అప్పుల కుప్ప. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు బారెడుంటే, బడ్జెట్ లో కేటాయింపులు మూరెడంత లేవన్నారు. ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించి, సూపర్ సిక్స్ హామీలకు పంగనామాలు పెట్టారంటూ ధ్వ‌జ‌మెత్తారు ష‌ర్మిలా రెడ్డి.. ఇతర ఎన్నికల హామీలకు ఎగనామం పెట్టారని పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కాద‌ని, ముంచే ప్రభుత్వమని మరోసారి నిరూపితం చేసుకున్నారంటూ ఎద్దేవా చేవారు.
బడ్జెట్ లో ఆడబిడ్డ నిధి ప్రస్తావనే లేదన్నారు. కూటమి గెలిచి రెండేళ్లు అవుతున్నా మహాశక్తి పథకం అసలుందో లేదో తెలియదన్నారు ష‌ర్మిలా రెడ్డి. నెలకు రూ . 15 వందలు ఇస్తామని నమ్మించి కోటిన్నర మంది మహిళలను రెండేళ్లుగా చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. రూ.10 లక్షల వరకు ఉచిత రుణాలు అని చెప్పి సున్నావడ్డి పథకానికి ఒక్క రూపాయి కేటాయించ లేద‌న్నారు. నిరుద్యోగులకు మళ్లీ టోకరా పెట్టారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బడ్జెట్ లో నిరుద్యోగ భృతి హామీపై ఊసే లేదన్నారు. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తామని చెప్పి బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా 50 లక్షల మంది నిరుద్యోగులను మళ్లీ మోసం చేశారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డ. జనవరి నెలలో ఇస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్ గురించి కూడా చెప్పనే లేదన్నారు. ఫీజు రీయింబర్స్ పథకానికి చిల్లిగవ్వ ఇచ్చిన పాపాన పోలేద‌న్నారు. 50 ఏళ్లకే పెన్షన్ హామీకి దిక్కు లేద‌న్నారు. ప్రభుత్వ ఉద్యోగులను సైతం వంచించారని ఆరోపించారు.
The post ఏపీ రాష్ట్ర బ‌డ్జెట్ కొత్త సీసాలో పాత సారా : వైఎస్ ష‌ర్మిల appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

బీఎంసీ ఎన్నిక‌ల్లో ఓటు చోరీ నిజం : రాహుల్ గాంధీబీఎంసీ ఎన్నిక‌ల్లో ఓటు చోరీ నిజం : రాహుల్ గాంధీ

ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. తాజాగా మ‌హారాష్ట్ర‌లో జ‌రిగిన బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) ఎన్నిక‌ల్లో ఓటు చోరీ జ‌రిగింద‌ని ఆయ‌న ఆరోపించారు. శుక్ర‌వారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈసీపై

టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా స‌చిన్టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా స‌చిన్

ముంబై : వ‌ర‌ల్డ్ టాప్ క్లాస్ క్రికెట‌ర్, భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్ స‌చిన్ ర‌మేష్ టెండూల్క‌ర్ కు అరుదైన ఛాన్స్ ల‌భించింది. తాజాగా ప్ర‌ముఖ పెయింట్స్ సంస్థ టెక్నో కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. త‌న‌ను త‌మ కంపెనీకి బ్రాండ్

Minister Nara Lokesh: ప్రధాని పర్యటనపై మంత్రి లోకేశ్ సమీక్షా సమావేశంMinister Nara Lokesh: ప్రధాని పర్యటనపై మంత్రి లోకేశ్ సమీక్షా సమావేశం

    ఈనెల 16వతేదీన కర్నూలులో ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే సూపర్ జిఎస్ టి – సూపర్ సేవింగ్స్ సభను విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ కోరారు.