hyderabadupdates.com Gallery ఐపీఎల్ లో స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నం చేస్తా

ఐపీఎల్ లో స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నం చేస్తా

ఐపీఎల్ లో స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నం చేస్తా post thumbnail image

చెన్నై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌ముఖ క్రికెట్ కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లేతో జ‌రిగిన చిట్ చాట్ సంద‌ర్బంగా ప‌లు అంశాల గురించి త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నాడు. ఈ సంద‌ర్భంగా త‌న 11 ఏళ్ల క్రికెట్ ప్ర‌స్థానం ఇప్ప‌టి వ‌ర‌కు సాఫీగా సాగ‌లేద‌న్నాడు. ఈ జ‌ర్నీలో విజ‌యాల కంటే ఎక్కువ‌గా ఎదురు దెబ్బ‌లు ఉన్నాయ‌ని తెలిపాడు సంజు శాంస‌న్. మ‌రి ఈసారి జ‌రిగే ఐపీఎల్ లో ఎలాంటి ప్లాన్ చేశావ‌ని అడిగిన ప్ర‌శ్న‌కు చాలా కూల్ గా స‌మాధానం ఇచ్చాడు. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ -2026లో నా ఆట‌తీరు కొంచెం మొద‌ట్లో ఇబ్బందిక‌రంగా ఉండింది. కానీ నాకు మిగ‌తా మ్యాచ్ ల‌లో ఛాన్స్ ఇచ్చారు హెడ్ కోచ్ గంభీర్. ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ గాయ‌డ‌డంతో నేను త‌న స్థానంలో ఆడాల్సి వ‌చ్చింద‌ని తెలిపాడు.
దీంతో ఆ స‌మ‌య‌లో నా కెరీర్ ముగిసి పోతుంద‌ని అనుకున్నా. ఎందుకంటే అప్ప‌టికే నేను కీవీస్ తో జ‌రిగిన సీరీస్ లో దారుణంగా విఫలం చెందాను. అన‌వ‌స‌ర షాట్స్ ఆడి వికెట్ల‌ను పారేసుకున్నాన‌ని తెలిపాడు. ఐదు మ్యాచ్ ల‌లో నేను చేసింది కేవ‌లం 50 ప‌రుగులు మాత్ర‌మే. ఆ స‌మ‌యంలో నేను పూర్తిగా నిరాశ చెందాను. కానీ ఆత్మ విశ్వాసం కోల్పోలేదు. డూ ఆర్ డై అన్న రీతిలో మైదానంలోకి వెళ్లాను. న‌మీబియాతో 22 , జింబాబ్వేతో 24 ప‌రుగులు చేశాడు. గౌతీ భాయ్ నా వ‌ద్ద‌కు వ‌చ్చాడు. త‌దుప‌రి మ్యాచ్ ల‌లో వికెట్ కీపింగ్ చేయాల్సింది నువ్వేన‌ని అన్నాడు. దీంతో నా పొజిష‌న్ ఏమిటో తెలిసి వ‌చ్చింద‌న్నాడు సంజు శాంస‌న్. ఈసారి జ‌రిగే ఐపీఎల్ లో నా వంతు బాగా ఆడేందుకు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని అన్నాడు. చెన్నై సూప‌ర్ కింగ్స్ ను విజ‌య తీరాల‌కు చేర్చేందుకు కృషి చేస్తాన‌ని చెప్పాడు.
The post ఐపీఎల్ లో స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నం చేస్తా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఆలయాల నిర్వహణ కోసం కార్ప‌స్ ఫండ్ : ఈవో సింఘాల్ఆలయాల నిర్వహణ కోసం కార్ప‌స్ ఫండ్ : ఈవో సింఘాల్

తిరుపతి : ఆలయాల నిర్వహణపై ఎస్ఓపీ విధానం అమ‌లు చేయాల‌ని అన్నారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. టిటిడి స్థానిక, అనుబంధ ఆలయాల నిర్వహణ, బడ్జెట్, ఎస్వోపీ, అభివృద్ధి పనులపై టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో మంగళవారం అధికారులతో

గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం స‌ర్కార్ కు రోడ్ మ్యాప్గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం స‌ర్కార్ కు రోడ్ మ్యాప్

హైద‌రాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజీ ఉండదన్నారు. అది వ్యవస్థ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుందన్నారు సీఎల్పీ సమావేశంలో .ప్రజా ప్రభుత్వంలో మూడవ బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నాం. ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్ ప్రణాళికలకు

టీమిండియాపై ర‌విశాస్త్రి షాకింగ్ కామెంట్స్టీమిండియాపై ర‌విశాస్త్రి షాకింగ్ కామెంట్స్

ముంబై : ఐసీసీ టి20 టోర్న‌మెంట్ లో ఊహంచ‌ని రీతిలో బిగ్ షాక్ త‌గిలింది ద‌క్షిణాఫ్రికా చేతిలో. ఏకంగా 76 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. టీమిండియా అస‌లైన కీల‌క మ్యాచ్ ఈనెల 26న గురువారం జ‌ర‌గ‌నుంది. విచిత్రం ఏమిటంటే ఈ