hyderabadupdates.com Gallery క‌మీష‌న్ల‌కు అడ్డాగా మారిన కాంగ్రెస్ పాల‌న

క‌మీష‌న్ల‌కు అడ్డాగా మారిన కాంగ్రెస్ పాల‌న

క‌మీష‌న్ల‌కు అడ్డాగా మారిన కాంగ్రెస్ పాల‌న post thumbnail image

హైద‌రాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు. ప్ర‌జా పాల‌న పేరుతో రాష్ట్రాన్ని స‌ర్వ నాశ‌నం చేస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నైని టెండర్ల రద్దు కాంగ్రెస్ పాలన క‌మీష‌న్లు దండుకునేందుకేన‌ని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కంటే కాంగ్రెస్ నాయకులు తమకు నచ్చిన వారికి కిక్‌బ్యాక్‌లు, బొగ్గు కేటాయింపులకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నైని బ్లాక్ టెండర్లను ఆకస్మికంగా రద్దు చేయడం వెనుక ఎవ‌రు ఉన్నారో చెప్పాల‌ని అన్నారు. కాంగ్రెస్ పాలన కమీషన్లు, కాంట్రాక్టులు, ప్రజాధనం దోపిడీకి సంబంధించిన పాలన అని తేలి పోయింద‌న్నారు.
బొగ్గు గనుల టెండర్లపై విచారణ కోరుతూ కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి లేఖలు రాసే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని, ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎస్సీసీఎల్‌లో తమ వారికి కాంట్రాక్టులు ఇవ్వడంలో సమానంగా బాధ్యత వహించిందని రామచందర్ రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ప‌క్ష‌పాత వైఖ‌రి, అవినీతి పాల‌న కార‌ణంగా బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో
ఎస్సీసీఎల్‌లో ఉద్యోగుల సంఖ్య 42,000కి పడి పోయిందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అది మరింతగా 38,000కి పడి పోయిందని రాష్ట్ర బీజేపీ చీఫ్ ఆరోపించారు. దీనిపై విచార‌ణ జ‌రిపించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.
The post క‌మీష‌న్ల‌కు అడ్డాగా మారిన కాంగ్రెస్ పాల‌న appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది – పవన్Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బ తీసింది – పవన్

    గత టీటీడీ బోర్డు పరిపాలనా వైఫల్యం, అనైతిక చర్యలు తిరుమల పవిత్రతను దెబ్బ తీశాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆ నమ్మక ద్రోహం ప్రస్తుత టీటీడీ బోర్డుకు ఒక లోతైన పాఠంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

డ‌యేరియా , క‌ల్తీ పాల వ్య‌వహారంపై సీఎం సీరియ‌స్డ‌యేరియా , క‌ల్తీ పాల వ్య‌వహారంపై సీఎం సీరియ‌స్

అమరావతి : శ్రీకాకుళం పట్టణంలో నీటి కలుషితం కారణంగా ప్రబలిన డయేరియా, రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా పలువురు చనిపోయిన ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో జరిగిన ఈ సమీక్షలో మున్సిపల్, ఆరోగ్య శాఖ అధికారులు

CJI BR Gavai: కేంద్ర ప్రభుత్వంపై సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ఆగ్రహంCJI BR Gavai: కేంద్ర ప్రభుత్వంపై సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ఆగ్రహం

    కేంద్ర ప్రభుత్వం తన ధర్మాసనం నుంచి తప్పించుకోవాలని చూస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ వ్యాఖ్యానించారు. కేసు తుది వాదనలు వినడానికి సిద్ధమైన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం విచారణను కోరుకోవడాన్ని