hyderabadupdates.com Gallery ‘కొత్త మ‌లుపు’ మూవీ ఫ‌స్ట్ లుక్ లాంచ్

‘కొత్త మ‌లుపు’ మూవీ ఫ‌స్ట్ లుక్ లాంచ్

‘కొత్త మ‌లుపు’ మూవీ  ఫ‌స్ట్ లుక్ లాంచ్ post thumbnail image

హైద‌రాబాద్ : సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా ఆకాష్‌, భైర‌వి అర్ద్యా క‌లిసి న‌టించిన చిత్రం కొత్త మ‌లుపు. ఇందుకు సంబంధించి హైద‌రాబాద్ లో బుధ‌వారం మూవీ ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేశారు. ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా న‌టిస్తుండ‌డం విశేషం. ఈ చిత్రం తధాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వ‌హించారు. తాటి బాలకృష్ణ నిర్మాణంలో రూపొందుతోంది ఈ చిత్రం . అంతే కాకుండా ఈ మూవీలో సీనియర్ నటులు రఘు బాబు, పృద్వి, ప్రభావతి తదితరులు కీలక పాత్ర‌లు పోషించారు.
ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు శివ వ‌ర‌ప్ర‌సాద్ మాట్లాడారు. రొమాంటిక్ లవ్ సస్పెన్స్‌తో పాటు హాస్యరసాన్ని కలగలిపి ఈ చిత్రాన్ని రూపొందించాం అని చెప్పారు. ఆకాష్–భైరవి జోడీ చాలా చక్కగా కుదిరిందని అన్నారు. వీరు బావ–మరదలుగా నటిస్తున్నార‌ని తెలిపారు. సంక్రాంతి కానుకగా ఫస్ట్ లుక్ విడుదల చేశామ‌ని,. త్వరలోనే సినిమా విడుదల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. నిర్మాత తాటి బాలకృష్ణ మాట్లాడుతూ.ఈ మూవీని పూర్తిగా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిస్తున్న‌ట్లు తెలిపారు. గ్రామీణ వాతావరణంలో సాగే కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంద‌న్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తామ‌న్నారు.
గ్రామీణ నేపథ్యంతో ప్రేమ–సస్పెన్స్–కామెడీ మేళవింపుతో రూపొందుతున్న కొత్త మలుపు ఫస్ట్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
The post ‘కొత్త మ‌లుపు’ మూవీ ఫ‌స్ట్ లుక్ లాంచ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

పెరిగిన విక్ట‌రీ వెంక‌టేష్ రెమ్యూన‌రేష‌న్పెరిగిన విక్ట‌రీ వెంక‌టేష్ రెమ్యూన‌రేష‌న్

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఏజ్ పెరిగినా ఇంకా డిమాండ్ ఉన్న న‌టుల‌లో మెగాస్టార్ చిరంజీవి కాగా మ‌రొక‌రు విక్ట‌రీ వెంక‌టేశ్. ఈ ఇద్ద‌రూ క‌లిసి తాజాగా న‌టించిన చిత్రం మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు ప్రేక్ష‌కుల

ప్ర‌జా పాల‌న ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక కార్యాచ‌ర‌ణప్ర‌జా పాల‌న ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక కార్యాచ‌ర‌ణ

హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రజా సేవకు, అభివృద్ధి ప్రణాళికల అమలుకు సరికొత్త కార్యక్రమాన్ని ప్రజా ప్రభుత్వం రూపొందించబోతోంది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యచరణకు సిద్ధమవుతోంది.. ఈ కార్యచరణపై దిశానిర్దేశం చేసేందుకు

బీఎంసీ ఎన్నిక‌ల్లో ఓటు చోరీ నిజం : రాహుల్ గాంధీబీఎంసీ ఎన్నిక‌ల్లో ఓటు చోరీ నిజం : రాహుల్ గాంధీ

ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. తాజాగా మ‌హారాష్ట్ర‌లో జ‌రిగిన బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) ఎన్నిక‌ల్లో ఓటు చోరీ జ‌రిగింద‌ని ఆయ‌న ఆరోపించారు. శుక్ర‌వారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈసీపై