hyderabadupdates.com Gallery కోట్లాది కూలీల క‌డుపు కొట్టిన కేంద్రం : షర్మిల

కోట్లాది కూలీల క‌డుపు కొట్టిన కేంద్రం : షర్మిల

కోట్లాది కూలీల క‌డుపు కొట్టిన కేంద్రం : షర్మిల post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్ర స‌ర్కార్ నిర్వాకం కార‌ణంగా దేశంలోని కోట్లాది మందికి కూలీ దొర‌క‌కుండా పోయింద‌న్నారు. కేవ‌లం కార్పొరేట్ శ‌క్తుల‌కు, బ‌డా వ్యాపార‌వేత్త‌ల‌కు మేలు చేకూర్చేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారంటూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ఏకి పారేశారు. ఆదివారం ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (MGNREGA) చట్ట పరిరక్షణ యాత్ర ఆదివారం విజయనగరం జిల్లాలో చేరింది. బొబ్బిలి నియోజకవర్గం పారాది గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి గ్రామస్థులు హాజ‌ర‌య్యారు. 100 రోజుల పనిపై కేంద్రం చేసిన కుట్రలను వివరించారు. చేసిన పనికి సైతం వేతనాలు సకాలంలో చెల్లించడం లేద‌ని వాపోయారు. కరువు పని అంటేనే పైసలివ్వరు అనే స్థాయికి పథకాన్ని దిగజార్చినట్లు శ్రామికులు ఆవేదన వ్యక్తం చేశారు.
మన్రేగా పథకానికి పీఎం మోడీ తెచ్చిన VB G- RAM G చట్టానికి ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. కాంగ్రెస్ చేస్తున్న ఉపాధి హామీ చట్ట పునరుద్ధరణకు బొబ్బిలి నియోజక వర్గ ప్రజల మద్దతు కూడగట్టడం జరిగిందన్నారు. ఇదిలా ఉండ‌గా కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంభిస్తోంద‌ని ఆరోపించారు. ఉపాధి హామీ ప‌థ‌కాన్ని పున‌రుద్ద‌రించాల‌ని, కోట్లాది మందికి ఉపాధి ద‌క్కించేలా చూడాల‌ని డిమాండ్ చేశారు .లేక‌పోతే దేశ వ్యాప్తంగా ఉద్య‌మానికి ఏపీ కీల‌కం కానుంద‌ని హెచ్చ‌రించారు ష‌ర్మిలా రెడ్డి.
The post కోట్లాది కూలీల క‌డుపు కొట్టిన కేంద్రం : షర్మిల appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

కాళేశ్వరం బ్యారేజీల ప‌నులు వేగవంతం చేయాలికాళేశ్వరం బ్యారేజీల ప‌నులు వేగవంతం చేయాలి

హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని మూడు కీలకమైన బ్యారేజీలైన మేడిగడ్డ, అన్నారం, సుండిల్లను వీలైనంత త్వరగా తిరిగి కార్యాచరణలోకి తీసుకు రావడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

ఏపీలో త్వరలో మరిన్ని ఎంజేపీ స్కూళ్లు : స‌విత‌ఏపీలో త్వరలో మరిన్ని ఎంజేపీ స్కూళ్లు : స‌విత‌

వత్సవాయి/జగ్గయ్యపేట : విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో కొత్తగా మరిన్ని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వెల్ల‌డించారు.