hyderabadupdates.com movies క్షతగాత్రులకు మాజీ మంత్రి వైద్యం

క్షతగాత్రులకు మాజీ మంత్రి వైద్యం

శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో 9 మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చాలామంది భక్తులు తీవ్రంగా గాయపడడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఘటనా స్థలానికి మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష తదితరులు వెళ్లి సహాయక చర్యలను పరిశీలించారు. అదే క్రమంలో మాజీ మంత్రి, వైసీపీ నేత డాక్టర్ సీదిరి అప్పల రాజు కూడా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

స్వతహాగా డాక్టర్ అయిన అప్పలరాజు వెంటనే కొందరు క్షతగాత్రులకు సీపీఆర్ చేసి వారి ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేశారు. కొందరు క్షతగాత్రులకు సీపీఆర్ చేసి వెంటనే ఆక్సిజన్ అందించే ప్రయత్నం చేశారు అప్పల రాజు. అప్పలరాజుతో పాటు స్థానిక వైసీపీ నేతలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైసీపీ సోషల్ మీడియా సర్కిల్స్ లో సర్క్యులేట్ అవుతోంది. సాధారణంగా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుంటారు. సహాయక చర్యలను కూడా ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది.

అయితే, అందుకు భిన్నంగా అప్పల రాజు స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొన్న వైనం చర్చనీయాంశమైంది. వైద్యో నారాయణో హరి అన్నదానికి న్యాయం చేసేలా అప్పలరాజు క్షతగాత్రులకు సీపీఆర్ చేసిన వైనం నిజంగా ప్రశంసనీయమని, డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆన్ డ్యూటీ అంటూ కొందరు వైసీపీ అభిమానులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related Post

రాజమౌళి రిలీజ్ డేట్ చెప్తారా ?రాజమౌళి రిలీజ్ డేట్ చెప్తారా ?

ఇంకో నాలుగు రోజుల్లో జరగబోతున్న ఎస్ఎస్ఎంబి 29 ఈవెంట్ కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో కనివిని ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న వైనం అక్కడికి వెళ్లి చూసిన వారికి షాక్ కలిగిస్తోంది. వంద అడుగుల

పార్టీ వివాదాల‌కు చెక్‌: లోకేష్ తార‌క మంత్రం.. !పార్టీ వివాదాల‌కు చెక్‌: లోకేష్ తార‌క మంత్రం.. !

టీడీపీలో నెల‌కొన్న వివాదాల‌కు అంతుద‌రి లేకుండా పోయింద‌న్న‌ది వాస్త‌వం. ఎమ్మెల్యేల‌ను క‌ట్ట‌డి చేసే బాధ్య‌త‌ను మంత్రుల‌కు, ఇంచార్జ్ మంత్రుల‌కు చంద్ర‌బాబు అప్ప‌గించారు. అయితే.. ఇది సాధ్య‌మేనా? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. వాస్త‌వానికి ఇంచార్జ్ మంత్రుల మాట‌ను కూడా ఎమ్మెల్యేలు పెద్ద‌గా