hyderabadupdates.com movies గాడిద వెర్సస్ అడ్డగాడిద.. సోషల్ మీడియాలో

గాడిద వెర్సస్ అడ్డగాడిద.. సోషల్ మీడియాలో

సోషల్ మీడియాలో ఓపక్క సినీ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ నడుస్తుంటే.. ఇంకోపక్క రాజకీయ కార్యకర్తలు, అభిమానుల మధ్య యుద్ధాలు జరుగుతుంటాయి. ఎప్పటికప్పుడు గొడవపడడానికి వాళ్లకు కొత్త కారణాలు దొరుకుతుంటాయి. కొన్నిసార్లు చిన్న విషయాలకే ట్రిగ్గర్ అయిపోతుంటారు. ఐతే ఇప్పుడు వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన రోజా సెల్వమణి చేసిన ఒక కామెంట్‌తో గత రెండు రోజులుగా సోషల్ మీడియా వేడెక్కింది. 

ఆమె తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి, వారి కుటుంబాలను కూడా టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఉగాది పండుగను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన భార్య భారతితో కలిసి సంప్రదాయ పద్ధతిలో జరుపుకోవడాన్ని గుర్తు చేస్తూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని.. తమ కుటుంబాలతో కలిసి ఉగాది వేడుకలు చేసుకోలేదేంటని విమర్శిస్తూ.. వారిని ‘గాడిదలు’ అంటూ సంబోధించారు రోజా.

ఐతే అదే రోజు సాయంత్రం తిరుపతికి చెందిన జనసేన నేత సుభాషిణి.. ప్రెస్ మీట్ పెట్టి రోజా తీరును దుయ్యబట్టారు. ఆమె జగన్ సతీమణి భారతిని అడ్డగాడిద అని సంబోధిస్తూ.. అధికారంలో ఉన్నపుడు ఈ అడ్డగాడిద ఎక్కడికి పోయింది, తిరుమలకు రాలేదేంటి.. పూజల్లో పాల్గొనలేదేంటి అంటూ విమర్శలు చేశారు.

ఇక అంతే వైసీపీ వాళ్లు పెద్ద ఎత్తున లైన్లోకి వచ్చేశారు. పవన్ కళ్యాణే ఇలా సుభాషిణితో మాట్లాడించాడని.. దీనికి మూల్యం చెల్లించుకుంటారని.. ఎప్పుడూ రాజకీయ వ్యాఖ్యలు చేయని భారతి రెడ్డి గురించి ఇలా మాట్లాడ్డమేంటని.. కుటుంబాల జోలికి వచ్చి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడమేంటని.. వ్యక్తిగత వ్యాఖ్యలు చేయం అన్న పవన్ కళ్యాణ్‌ ఈ కామెంట్ల మీద ఏం సమాధానం ఇస్తాడని వాళ్లు పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. కానీ ఇలా మాట్లాడుతున్న వాళ్లు.. రోజా చేసిన వ్యాఖ్యల గురించి మాత్రం ఏమీ స్పందించట్లేదు.

తిరుమలకు వెళ్లి రాజకీయ వ్యాఖ్యలు, అందునా దూషణలకు దిగిన రోజును కంట్రోల్ చేయకుండా.. ఆమె భాషలోనే సమాధానం చెప్పిన తమ నాయకురాలిని తప్పుబట్టడం ఏంటి అంటూ జనసైనికులు మండిపడుతున్నారు.

ముఖ్యమంత్రి హోదాలో స్కూల్ పిల్లల ముందు పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడిన ఘనత జగన్‌దే అని గుర్తు చేస్తూ.. చంద్రబాబు, పవన్‌ల మీద వ్యక్తిగతంగా దారుణమైన మాటలు మాట్లాడిన పోసాని, బోరుగడ్డ, పేర్ని నాని సహా ఎంతోమందిని ప్రోత్సహించింది జగనేనని.. చరిత్ర మరిచిపోయి తమ మీద ఎదురుదాడి చేస్తారా అంటూ జనసైనికులు దీటుగా బదులిస్తున్నారు. దీని మీద రెండు రోజులుగా సోషల్ మీడియా రణరంగంగా మారింది.

Related Post

ఒరేయ్ ఆంజనేయులు… ఐకానిక్ ‘అమృతం’ ఈజ్ బ్యాక్ఒరేయ్ ఆంజనేయులు… ఐకానిక్ ‘అమృతం’ ఈజ్ బ్యాక్

“19 ఏళ్ల కిందట ఏడుపుగౌట్టు సీరియళ్లు తెలుగు టీవీ తెరపై ఆధిపత్యం చలాయిస్తుండగా.. ఒక వ్యక్తి దృఢ సంకల్పంతో మొదలుపెట్టిన ఓ తెలుగు కామెడీ షో సంప్రదాయ తెరలన్నింటినీ తొలగించేసింది. ఐదుసార్లు మళ్లీ మళ్లీ ప్రసారమైన ఏకైక సీరియల్. 2.7 కోట్ల